epaper
Monday, March 2, 2026
epaper

పిల్లల హక్కులను కాపాడాలి

పిల్లల హక్కులను కాపాడాలి
వలస సుభాష్ చంద్రబోస్
బాల కార్మిక నిర్మూలనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి

కాకతీయ, కరీంనగర్ : ప్రపంచ బాలల హక్కుల దినోత్సవం సందర్భంగా కోహెడ మండలంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థుల చేతులతో పోస్టర్ ఆవిష్కరణ జరిగింది. ఈ సందర్భంగా బాలల హక్కుల ప్రజా వేదిక రాష్ట్ర అధ్యక్షులు, సామాజికవేత్త వలస సుభాష్ చంద్రబోస్ మాట్లాడుతూ.బాలల హక్కులను రక్షించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని, కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు బాల కార్మిక నిర్మూలన చట్టాలను కఠినంగా అమలు చేయాల్సిన అవసరం ఉందని తెలిపారు. పిల్లలు తమ హక్కులను తెలుసుకుని, వాటిని కాపాడుకోవడానికి సమాజం మొత్తం బాధ్యత వహించాలని సూచించారు.నేటి బాలలే రేపటి భారత పౌరులు. వారు పని చేయించడం గమనించిన వెంటనే టోల్ ఫ్రీ 1098కు సమాచారం ఇవ్వాలి అని పిలుపునిచ్చారు. చిన్నారులకు పరిశుభ్రమైన వాతావరణం, సంపూర్ణ ఆరోగ్యం, మంచి విద్య అందించాల్సిన బాధ్యత తల్లిదండ్రులదేనని పేర్కొన్నారు.బాలల హక్కుల ప్రజావేదిక గత రెండు దశాబ్దాలుగా బాల కార్మిక నిర్మూలన, బాల్య వివాహాల నిర్మూలన కోసం తెలంగాణవ్యాప్తంగా పని చేస్తోందని వెల్లడించారు. తెలంగాణను బాల కార్మిక రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రభుత్వ పాఠశాలలకు మరిన్ని నిధులు కేటాయించి, వాటిని బలోపేతం చేయాలని కోరారు.చిన్నారులు పట్టుదలతో చదువుపై దృష్టి పెట్టి, పుస్తక పఠన అలవాటు పెంచుకొని భవిష్యత్తుకు పునాది వేసుకోవాలని ప్రోత్సహించారు.ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు మహమ్మద్ మహిముద్దీన్, మాజీ విద్యా కమిటీ ఛైర్మన్ గాజుల వెంకటేశ్వర్లు, బాలల హక్కుల ప్రజావేదిక ఉమ్మడి కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు బైరి చంద్రశేఖర్, విద్యార్థులు పాల్గొన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

వేములవాడ ఏఎస్పీకి ఆకస్మిక బదిలీ..!

వేములవాడ ఏఎస్పీకి ఆకస్మిక బదిలీ..! రెండు నెలల్లోనే రుత్విక్ సాయి ట్రాన్స్‌ఫర్ డీఎస్పీగా శ్రీనివాసులు...

సర్కారు భూముల కబ్జాలపై కఠిన చర్యలు

సర్కారు భూముల కబ్జాలపై కఠిన చర్యలు ఆక్రమణలు తొలగించి పేదలకు పంపిణీ ధర్మారంలో క్రీడా...

ఎమ్మెల్యే వ్యాఖ్యలపై రజక సంఘాల ఆగ్రహం

ఎమ్మెల్యే వ్యాఖ్యలపై రజక సంఘాల ఆగ్రహం కరీంనగర్‌లో వీర్లపల్లి శంకర్ దిష్టిబొమ్మ దహనం బాధిత...

లక్ష్మీనరసింహస్వామి కళ్యాణంలో కలెక్టర్ దంపతులు

లక్ష్మీనరసింహస్వామి కళ్యాణంలో కలెక్టర్ దంపతులు పట్టు వస్త్రాలు సమర్పణ కాక‌తీయ‌, జగిత్యాల : ధర్మపురి...

హుజూరాబాద్‌లో బీఆర్‌ఎస్ భూస్థాపితం ఖాయం

హుజూరాబాద్‌లో బీఆర్‌ఎస్ భూస్థాపితం ఖాయం కాంగ్రెస్ నియోజకవర్గ ఇంచార్జి ప్రణవ్ కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలు,...

బండి సంజయ్ ధర్మం తప్పుతున్నారు

బండి సంజయ్ ధర్మం తప్పుతున్నారు బీఆర్‌ఎస్ నగర అధ్యక్షుడు చల్ల హరిశంకర్ రెబల్స్ చేరిక,...

50వ డివిజన్‌ను ఆదర్శంగా తీర్చిదిద్దుతా

50వ డివిజన్‌ను ఆదర్శంగా తీర్చిదిద్దుతా కార్పొరేటర్ బోయినపల్లి ప్రవీణ్ రావు కాక‌తీయ‌, కరీంనగర్ :...

సైన్స్‌పై మ‌క్కువ పెంచుకోవాలి

సైన్స్‌పై మ‌క్కువ పెంచుకోవాలి ప్రశ్నించేత‌త్వం అల‌వ‌ర్చుకోవాలి రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ కాకతీయ, రుద్రంగి:...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!?

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!? సీజ్ చేసిన క‌ల‌ప‌ మాయం..?! ములుగు జిల్లా అట‌వీశాఖ‌లో క‌ల‌క‌లం వేరే...

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్ 116 మునిసిపాలిటీలు.. 7కార్పోరేష‌న్ల‌లో న‌మోదైన పోలింగ్ శాతం వివ‌రాలు ఒక్క...

ఔష‌ధం కాదు.. ! విషం..!!

ఔష‌ధం కాదు.. ! విషం..!! తెలంగాణలో తయారైన 35ర‌కాల మందులు ఫెయిల్‌ సీడీఎస్‌సీవో తనిఖీల్లో...

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..!

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..! చరిత్రకు జానపద స్వరం..అద్భుతం పాట రూపంలో సమ్మక్క–సారలమ్మ...

మేడారంలో హైటెక్ భద్రత

మేడారంలో హైటెక్ భద్రత మూడు కోట్ల మందికిపైగా భక్తుల రాక అంచనా కమాండ్ కంట్రోల్...

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...
spot_img

Popular Categories

spot_imgspot_img