epaper
Monday, March 2, 2026
epaper

హిందుత్వమే నా శ్వాస

హిందుత్వమే నా శ్వాస
నా నోటి నుంచి హిందుత్వ నినాదం ఆగిన రోజు నా శ్వాస ఆగిన‌ట్లే
ప్రజాభిప్రాయాన్ని మార్చగలిగే శక్తి హిందుత్వానికి ఉంది
బీజేపీ మూడు సార్లు కేంద్రంలో అధికారంలోకి రావ‌డానికి అదే కార‌ణం
ముస్లింలు బీజేపీకి వ్యతిరేకంగా ఏకతాటిపై ఓటేస్తున్నారు
హిందువులు ఆత్మపరిశీలన చేసుకోవాల్సిన అవ‌స‌రం ఉంది
కేంద్ర హోం స‌హాయ‌క శాఖ మంత్రి బండి సంజయ్ సంచ‌ల‌న వ్యాఖ్యలు

కాకతీయ, హుజూరాబాద్ : హిందుత్వ‌మే త‌న శ్వాస అని, త‌న నోటి నుంచి హిందుత్వ నినాదం ఆగిన రోజు త‌న శ్వాస ఆగిన‌ట్లేన‌ని కేంద్ర హోం స‌హాయ‌క శాఖ మంత్రి బండి సంజయ్ అన్నారు. క‌రీంన‌గ‌ర్ జిల్లా హుజూరాబాద్‌లో కరీంనగర్ పార్లమెంట్ పరిధి పోలింగ్ బూత్ అధ్యక్షులు, పైస్థాయి నేతల సమావేశంలో ఆయన ఉద్ఘాటించారు. తెలంగాణలో ప్రజాభిప్రాయాన్ని మార్చగల శక్తి హిందుత్వానికి ఉంద‌ని, బీజేపీ మూడు సార్లు కేంద్రంలో అధికారం సాధించడానికి కూడా అదే ప్రధాన కారణమని చెప్పారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో నాలుగు సీట్లతో ఉన్న బీజేపీని 48 సీట్ల వరకు తీసుకెళ్లింది హిందుత్వం శక్తేనని, కరీంనగర్ లో తాను ఎంపీగా గెలుపొందడానికీ అదే తోడ్పడిందని ఆయన గర్వంగా పేర్కొన్నారు. ముస్లిం, క్రైస్తవ, హిందూ అనే తేడాలు లేకుండా మోదీ ప్రభుత్వం అందరికీ సంక్షేమ పథకాలు అందిస్తుండగా, ఎన్నికల సమయంలో ఇమామ్‌లు, మౌలానాల పిలుపుతో ముస్లింలు బీజేపీకి వ్యతిరేకంగా ఏకతాటిపై ఓటేయడం ఆత్మపరిశీలనకు గురిచేయాల్సిన విషయం అన్నారు.12 శాతం ముస్లింలు ఒక తీర్పుకి వస్తే, 80 శాతం హిందువులు ఏకం అయితే తప్పేంటి? అని ప్రశ్నించారు. హిందుత్వంపై తన వైఖరి మారదని,దేవాలయాల ధ్వంసం, గోరక్షకులపై దాడులు, పోలీసులపై ముస్లిం తీవ్రవాదుల దాడులు జరుగుతున్నప్పుడు హిందుత్వం గురించి మాట్లాడక తప్పదని స్పష్టం చేశారు. ట్రిపుల్ తలాక్ రద్దు చేసి ముస్లిం మహిళలకు గౌరవం తీసుకొచ్చింది మోదీ ప్రభుత్వం అనే విషయాన్ని గుర్తుచేశారు.

పంచాయ‌తీల‌పై రాష్ట్ర ప్ర‌భుత్వం నిర్ల‌క్ష్యం
రాష్ట్ర ప్రభుత్వం పంచాయతీల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని వ్యాఖ్యానించిన ఆయన, రెండు సంవత్సరాల్లో కాంగ్రెస్ ఒక్క పంచాయతీకీ పైసా కూడా ఇవ్వలేదని ఆరోపించారు. గ్రామాల్లో 15వ ఫైనాన్స్ కమిషన్ నిధులు, ఎంపీ లాడ్స్, ఉపాధి హామీ, సడక్ యోజన వంటి అభివృద్ధి కార్యక్రమాలన్నీ కేంద్రం ద్వారానే నడుస్తున్నాయని వివరిస్తూ, సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిస్తే పంచాయతీలకు నిధులు రాకపోవడం తప్పదన్నారు. బీజేపీ అభ్యర్థులను గెలిపిస్తే అవసరమైతే సీఎస్సార్ నిధులైనా తెచ్చి పంచాయతీల అభివృద్ధి కోసం ఖర్చు చేస్తానని హామీ ఇచ్చారు. హుజూరాబాద్, జమ్మికుంట, వేములవాడ ఆసుపత్రులకు సీ‌ఎస్‌ఆర్ ద్వారా ఐదు కోట్ల రూపాయల మెడికల్ పరికరాలు అందజేసిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు. హుజూరాబాద్‌లో స్టేడియం నిర్మాణానికి 10 కోట్లు విడుదల చేయనున్నట్లు తెలిపారు. సీఐఆర్ఎఫ్ కింద తెలంగాణకు వచ్చిన 1200 కోట్లలో 500 కోట్లు కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో ఖర్చు చేసినట్లు వెల్లడించారు. కాంగ్రెస్ రెండేళ్ల పాలన పూర్తయిన సందర్భంలో తెలంగాణ రైజింగ్ ఫెస్టివల్ నిర్వహిస్తుండటం కేవలం ప్రచార ప్రయోజనాల కోసం మాత్రమేనని విమర్శించారు. అభయ హస్తం పేరుతో 420 హామీలు ఇచ్చి ఒక్కటీ అమలు చేయని ప్రభుత్వం ఇప్పుడు ఫెస్టివల్ చేస్తుందా? అని నిలదీశారు. మహిళలకు నెలకు ₹2500, తులం బంగారం, స్కూటీ, రైతులకు 15 వేల రూపాయలు, నిరుద్యోగులకు నెలకు నాలుగు వేల భృతి, పేదలకు ఇళ్లు వంటి అనేక హామీలు అమలుకాలేదని గుర్తుచేశారు. బీసీలు, ఎస్సీలు, ఎస్టీలకు ప్రకటించిన డిక్లరేషన్లు కూడా కాగితాల్లోనే మిగిలిపోయాయని మండిపడ్డారు.

బీఆర్ ఎస్ పాల‌న‌లో పంచాయతీలు సంక్షోభంలోకి

బీఆర్ఎస్ పాలనలో పంచాయతీలు తీవ్రమైన సంక్షోభంలోకి నెట్టివేయబడి, అప్పుల పాలై సర్పంచులు, ఉద్యోగులు ఆత్మహత్యలకు పాల్పడాల్సి వచ్చిందని ఆయన ఆరోపించారు. ఈ సమావేశానికి రాష్ట్ర సంఘటనా మంత్రి చంద్రశేఖర్ తివారీ, ఎమ్మెల్సీ అంజిరెడ్డి, గంగిడి మనోహర్ రెడ్డి, జిల్లాధ్యక్షులు గంగాడి కృష్ణారెడ్డి, రెడ్డబోయిన గోపి తదితరులు హాజరయ్యారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ వైఫల్యాలను ఎండగడుతూ రూపొందించిన కరపత్రం మరియు సంతకాల సేకరణ పత్రాలను నేతలు కలిసి విడుదల చేశారు. 26న ప్రారంభమయ్యే సంతకాల సేకరణ కార్యక్రమంలో ఇంటింటికీ వెళ్లి ప్రజల్లో అవగాహన పెంచాలని బండి సంజయ్ కార్యకర్తలను కోరారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

వేములవాడ ఏఎస్పీకి ఆకస్మిక బదిలీ..!

వేములవాడ ఏఎస్పీకి ఆకస్మిక బదిలీ..! రెండు నెలల్లోనే రుత్విక్ సాయి ట్రాన్స్‌ఫర్ డీఎస్పీగా శ్రీనివాసులు...

సర్కారు భూముల కబ్జాలపై కఠిన చర్యలు

సర్కారు భూముల కబ్జాలపై కఠిన చర్యలు ఆక్రమణలు తొలగించి పేదలకు పంపిణీ ధర్మారంలో క్రీడా...

ఎమ్మెల్యే వ్యాఖ్యలపై రజక సంఘాల ఆగ్రహం

ఎమ్మెల్యే వ్యాఖ్యలపై రజక సంఘాల ఆగ్రహం కరీంనగర్‌లో వీర్లపల్లి శంకర్ దిష్టిబొమ్మ దహనం బాధిత...

లక్ష్మీనరసింహస్వామి కళ్యాణంలో కలెక్టర్ దంపతులు

లక్ష్మీనరసింహస్వామి కళ్యాణంలో కలెక్టర్ దంపతులు పట్టు వస్త్రాలు సమర్పణ కాక‌తీయ‌, జగిత్యాల : ధర్మపురి...

హుజూరాబాద్‌లో బీఆర్‌ఎస్ భూస్థాపితం ఖాయం

హుజూరాబాద్‌లో బీఆర్‌ఎస్ భూస్థాపితం ఖాయం కాంగ్రెస్ నియోజకవర్గ ఇంచార్జి ప్రణవ్ కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలు,...

బండి సంజయ్ ధర్మం తప్పుతున్నారు

బండి సంజయ్ ధర్మం తప్పుతున్నారు బీఆర్‌ఎస్ నగర అధ్యక్షుడు చల్ల హరిశంకర్ రెబల్స్ చేరిక,...

50వ డివిజన్‌ను ఆదర్శంగా తీర్చిదిద్దుతా

50వ డివిజన్‌ను ఆదర్శంగా తీర్చిదిద్దుతా కార్పొరేటర్ బోయినపల్లి ప్రవీణ్ రావు కాక‌తీయ‌, కరీంనగర్ :...

సైన్స్‌పై మ‌క్కువ పెంచుకోవాలి

సైన్స్‌పై మ‌క్కువ పెంచుకోవాలి ప్రశ్నించేత‌త్వం అల‌వ‌ర్చుకోవాలి రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ కాకతీయ, రుద్రంగి:...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!?

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!? సీజ్ చేసిన క‌ల‌ప‌ మాయం..?! ములుగు జిల్లా అట‌వీశాఖ‌లో క‌ల‌క‌లం వేరే...

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్ 116 మునిసిపాలిటీలు.. 7కార్పోరేష‌న్ల‌లో న‌మోదైన పోలింగ్ శాతం వివ‌రాలు ఒక్క...

ఔష‌ధం కాదు.. ! విషం..!!

ఔష‌ధం కాదు.. ! విషం..!! తెలంగాణలో తయారైన 35ర‌కాల మందులు ఫెయిల్‌ సీడీఎస్‌సీవో తనిఖీల్లో...

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..!

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..! చరిత్రకు జానపద స్వరం..అద్భుతం పాట రూపంలో సమ్మక్క–సారలమ్మ...

మేడారంలో హైటెక్ భద్రత

మేడారంలో హైటెక్ భద్రత మూడు కోట్ల మందికిపైగా భక్తుల రాక అంచనా కమాండ్ కంట్రోల్...

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...
spot_img

Popular Categories

spot_imgspot_img