మత్తుకు బానిసలు కావద్దు
ఎస్ఐ:మాలోత్ సురేష్
కాకతీయ,నర్సింహులపేట: యువత మత్తుకు బానిసలు కావద్దని,మాదకద్రవ్య రహిత సమాజ నిర్మాణం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఎస్ఐ మాలోత్ సురేష్ అన్నారు. మంగళవారం మండల కేంద్రంలోని చౌరస్తాలో మాదకద్రవ్యాలు,మత్తు పదార్థాలు దుర్వినియోగ నివారణ,వినియోగం తగ్గించే కార్యక్రమం నిర్వహించి ప్రజలచేత ప్రతిజ్ఞ చేయించారు.ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ మాదకద్రవ్యాల వినియోగం వలన కలిగే దుష్ప్రభావాలపై యువత,విద్యార్థులు అవగాహన కలిగి ఉండాలన్నారు.మత్తు పదార్థాలకు అలవాటు పడితే విలువైన జీవితం కోల్పోవల్సి వస్తుందన్నారు.మన సమాజం ఎదుర్కొంటున్న కీలక సమస్యలలో మాదకద్రవ్యాల వాడకం ఒకటని,పలు అంశాలపై అవగాహన కల్పించారు.సమాజం కోసం పాటుపడాలని సూచించారు.ఈకార్యక్రమంలో కాంగ్రెస్ గ్రామపార్టీ అధ్యక్షుడు కడుదుల రామకృష్ణ,బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు జగదీశ్వర్,గ్రామప్రజలు,పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.


