epaper
Thursday, January 15, 2026
epaper

యువత రాజకీయాల్లోకి రావాలి

యువత రాజకీయాల్లోకి రావాలి
బండి సంజయ్
సర్దార్@150 యూనిటీ మార్చ్‌లో కేంద్ర మంత్రి
సౌదీ బస్సు ప్రమాదంపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన బండి

కాకతీయ, కరీంనగర్ : యువత దేశ నిర్మాణంలో రాజకీయాల్లోకి ముందుకు రావాలని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అన్నారు. వారసత్వ రాజకీయాలు దేశాన్ని వెనక్కి లాగుతున్నాయని, యువత వ్యవస్థలోకి రాకపోతే ఈ ధోరణి మరింత బలపడే ప్రమాదం ఉందని హెచ్చరించారు. ఉక్కుమనిషి సర్దార్ వల్లభాయి పటేల్ 150వ జయంతి ఉత్సవాల సందర్భంగా సోమవారం కరీంనగర్‌లోని ఎస్సారార్ కళాశాల నుంచి ప్రారంభమైన ‘సర్దార్@150 యూనిటీ మార్చ్’లో ఆయన పాల్గొన్నారు. వేలాది మంది విద్యార్థులు, యువత నినాదాలతో అతడు ముందుకు సాగగా పాదయాత్రకు విశేష స్పందన లభించింది.ఈ సందర్భంగా సంజయ్ మాట్లాడుతూ, దేశ ఐక్యత కోసం తన జీవితాన్ని అర్పించిన పటేల్ చరిత్రలో మహత్తర నాయకుడని, దేశంలోని 560 సంస్థానాలను భారత త్రివర్ణ పతాకం కింద కలుపడంలో ఆయన పాత్ర అపూర్వమని గుర్తుచేశారు. పటేల్ లేకపోతే తెలంగాణ పరిస్థితి పూర్తిగా మరో దిశలోకి వెళ్లిపోయే ప్రమాదం ఉందని, నిజాం కుట్రలను ఛేదించి ‘ఆపరేషన్ పోలో’ ద్వారా తెలంగాణను భారత్‌లో విలీనం చేయడం పటేల్ దూరదృష్టికి నిదర్శనమన్నారు. ఐఏఎస్, ఐపీఎస్ వంటి ఆధునిక పరిపాలనా వ్యవస్థలకు పటేల్ పునాది వేశారని వివరించారు.దేశ అభివృద్ధి కోసం యువత రాజకీయాల్లో కీలక పాత్ర వహించాలని ఆయన సూచించారు. ఉద్యోగాలు, వ్యాపారాలు, విదేశాల్లో అవకాశాలకే తమ భవిష్యత్తును పరిమితం చేసుకుంటే పాలనా వ్యవస్థలో యువత భాగస్వామ్యం తగ్గిపోతుందని, ఫలితంగా కుటుంబ ఆధారిత రాజకీయాలు పెరిగి దేశానికి నష్టం జరుగుతుందని పేర్కొన్నారు. మరోవైపు డ్రగ్స్, మద్యం, పబ్ కల్చర్ వంటి అలవాట్లలో చిక్కుకుంటున్న యువతను సమాజం కోల్పోకూడదని, దేశం ముందుకు సాగాలంటే యువత ఆలోచన, శక్తి రాజకీయాల్లో వినియోగించాల్సిందేనన్నారు.సౌదీ అరేబియాలో జరిగిన ఘోర బస్సు ప్రమాదంలో 42 మంది భారతీయులు మృతి చెందడం బాధాకరమని, అందులో 18 మంది తెలుగు వారు ఉన్నట్లు తెలిసి తీవ్ర దిగ్బ్రాంతికి గురయ్యానని తెలిపారు. ఘటనపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా సౌదీ అధికారులతో మాట్లాడుతున్నారని, బాధిత కుటుంబాలకు అన్ని విధాలా సాయం అందించనున్నట్టు హామీ ఇచ్చారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు.జగిత్యాల జిల్లా బసపురం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదం పట్ల కూడా విచారం వ్యక్తం చేసిన బండి సంజయ్, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా అవగాహన, ట్రాఫిక్ నియమాలపై ప్రజల్లో మరింత చైతన్యం రావాల్సిన అవసరం ఉందన్నారు. బాధిత కుటుంబాలకు తగిన సాయం అందేలా చర్యలు తీసుకుంటామని భరోసా ఇచ్చారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

వృద్ధురాలిని నట్టేట ముంచారు..!

వృద్ధురాలిని నట్టేట ముంచారు..! విలువైన భూముల అక్రమ రిజిస్ట్రేషన్లు మీడియా ముందుకు వచ్చిన శంభునిపల్లి...

జర్నలిస్టుల అరెస్టులు అన్యాయం

జర్నలిస్టుల అరెస్టులు అన్యాయం అక్రమ అరెస్టులను ఖండించిన టీడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర కో కన్వీనర్ కే....

పురాభివృద్ధే నా లక్ష్యం..!

పురాభివృద్ధే నా లక్ష్యం..! ఎన్నికల హామీల అమలే ప్రాధాన్యం క్యాతన్‌పల్లిలో అభివృద్ధి పనులకు శ్రీకారం సీసీ...

వావిలాలలో వైభవంగా గోదాదేవి కల్యాణం

వావిలాలలో వైభవంగా గోదాదేవి కల్యాణం కాకతీయ, జమ్మికుంట : ధనుర్మాస ఉత్సవాల ముగింపు...

వలపు వల… లక్షల లూటీ

వలపు వల… లక్షల లూటీ ఇన్‌స్టాగ్రామ్ ముసుగులో సెక్స్ ట్రాప్ నగ్న వీడియోలతో...

వాస్తవాల‌కు వేదికగా కాకతీయ

వాస్తవాల‌కు వేదికగా కాకతీయ వెహికిల్ ఇన్‌స్పెక్టర్ కంచె వేణు కాకతీయ, హుజురాబాద్ : ప్రజా...

నో కాంప్రమైజ్.. ఆన్ డ్యూటీ..!

నో కాంప్రమైజ్.. ఆన్ డ్యూటీ..! ఎస్సైపై వేటు నిలిపివేయాల‌ని ఎమ్మెల్యే హుకుం..!! వెన‌క్కి త‌గ్గ‌ని...

సీఏం రేవంత్ రెడ్డి మాటల మాంత్రికుడు

సీఏం రేవంత్ రెడ్డి మాటల మాంత్రికుడు 6 డీఏలు పెండింగ్ అంటే రాష్ట్రం...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...

రేవంత్ కు కొత్త సవాల్!

* సర్కార్ కు పరీక్షగా సీఎస్ ఎంపిక? * ఈ నెలాఖరున రామకృష్ణారావు...

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం కాక‌తీయ‌, హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లాలోని బాటసింగారంలో...

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన ప్రతిపాదించిన ప్రాజెక్టుపై...

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా న్యూ డిల్లీ జూలై...

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు మొన్న యూనివర్సిటీల్లో ఆందోళనలు నిషేధిస్తూ మెమో నేడు...

రాష్ట్రంలో హద్దులు దాటిపోతున్న ఫోన్‌ ట్యాపింగ్‌

రాష్ట్రంలో హద్దులు దాటిపోతున్న ఫోన్‌ ట్యాపింగ్‌ కాంగ్రెస్‌ దూత ఫోన్‌ ట్యాపింగ్‌..! గాంధీ...
spot_img

Popular Categories

spot_imgspot_img