epaper
Sunday, November 16, 2025
epaper

అర్చకుల సూచనలు తీసుకుంటూ జాతర ఏర్పాట్లు..మంత్రి సీతక్క

అర్చకుల సూచనలు తీసుకుంటూ జాతర ఏర్పాట్లు..మంత్రి సీతక్క

కాకతీయ, ములుగు ప్రతినిధి: శ్రీ మేడారం సమ్మక్క–సారలమ్మ మహా జాతరకు భక్తుల రాక పెరుగుతున్న నేపథ్యంలో, అమ్మవార్ల గద్దెల పవిత్రత దెబ్బతినకుండా అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతాయని మంత్రి సీతక్క అర్చకులకు హామీ ఇచ్చారు. రాబోయే జనవరి 28 నుండి 31 తేదీల్లో జరిగే జాతర కోసం జరుగుతున్న ఏర్పాట్లను ఆదివారం మంత్రి ప్రత్యేకంగా పరిశీలించారు. దేవాలయ ప్రాంతంలో జరుగుతున్న రహదారి, పారిశుద్ధ్యం, కట్టడాలు, నీటి సదుపాయాల పనులను పరిశీలించిన మంత్రి, పూజారుల సంఘం అధ్యక్షుడు జగ్గారావు, అర్చకులు వీరస్వామితో సమావేశమై వారి సూచనలు వినిపించారు. గద్దెల వద్ద భక్తుల రద్దీ పెరిగిన సమయంలో పవిత్రత, శుభ్రత, భక్తి వాతావరణం కాపాడటం అత్యంత ముఖ్యం అని అర్చకులు పేర్కొనగా, అర్చకుల అభిప్రాయాలే జాతర నిర్వహణలో కీలకం అని మంత్రి సీతక్క తెలిపారు. అమ్మవార్ల గద్దెల ప్రాంగణం ఏ విధంగానూ దెబ్బతినకుండా పునరుద్ధరణ పనులు చేస్తున్నాం అని,పూజా కార్యక్రమాలకు ఆటంకం లేకుండా అన్ని ఏర్పాట్లు జరుగుతాయి అని, అర్చకుల సూచనల మేరకు కొన్ని మార్పులు కూడా చేపట్టాలని సంబంధిత అధికారులకు ఆదేశించాం అని మంత్రి సీతక్క చెప్పారు.

కలెక్టర్ దివాకర, గ్రంథాలయ సంస్థ చైర్మన్ రవి చందర్, మార్కెట్ కమిటీ చైర్మన్ రేగ కళ్యాణిలతో కలిసి మంత్రి పలు కీలక ప్రాంతాలను సందర్శించారు. భక్తుల సౌకర్యం కోసం ప్రత్యేక నీటి ట్యాంకులు, శుచీకరణ కేంద్రాలు, పార్కింగ్ ఏరియాలు, రవాణా సదుపాయాలు వేగంగా సిద్ధమవుతున్నాయి. అంతకుముందు అమ్మవార్ల దర్శనం చేసిన మంత్రి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమ్మవార్ల సేవలో భక్తుడిలా ముందుండి మార్గనిర్దేశం చేస్తున్నారు అని, భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా జాతర నిర్వహణే ప్రభుత్వ లక్ష్యం అని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఆర్ అండ్ బీ, పంచాయతీరాజ్‌, ట్రైబల్ వెల్ఫేర్, ఇరిగేషన్ శాఖల అధికారులు, అర్చకులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

హన్మకొండ జిల్లాకు 2.25 కోట్ల చేప పిల్లలు..

హన్మకొండ జిల్లాకు 2.25 కోట్ల చేప పిల్లలు.. మత్స్యకారుల అభ్యున్నతే ప్రభుత్వ ధ్యేయం.. ధర్మసాగర్...

మృతుని కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే

మృతుని కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే కాకతీయ, ఇనుగుర్తి: మండలం లోని కోమటిపల్లి గ్రామానికి...

మార్కండేయ ఆలయంలో మహా అన్నదానం

మార్కండేయ ఆలయంలో మహా అన్నదానం నాగయ్య శాస్త్రి మంత్రోచ్ఛరణ లతో ప్రత్యేక పూజలు కాకతీయ,నెల్లికుదురు:...

పద్మశాలి కార్తీకమాస వనభోజనం…

పద్మశాలి కార్తీకమాస వనభోజనం... ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి, మేయర్... కాకతీయ, వరంగల్ సిటీ...

రామాలయంలో కార్తీక వన భోజనాలు

రామాలయంలో కార్తీక వన భోజనాలు ఆలయ ప్రాంగణంలో సకల దేవత పారాయణం ప్రధాన అర్చకులు...

కొత్తూరు ఉద్యోగ సంఘాల పాత్ర అభినందనీయం

కొత్తూరు ఉద్యోగ సంఘాల పాత్ర అభినందనీయం ఆపదలో ఉన్న కుటుంబాలకు ఆర్థిక చేయూతనందిస్తూ...

కార్యకర్తలకు అండగా సేవాదళ్

కార్యకర్తలకు అండగా సేవాదళ్ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన దుగ్గొండి మండల కాంగ్రెస్...

తూర్పుకోటలో యువత పాత్రపై అవగాహన సదస్సు

తూర్పుకోటలో యువత పాత్రపై అవగాహన సదస్సు సమాజ నిర్మాణములో యూవత పాత్ర అగ్రస్థానం...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...

రేవంత్ కు కొత్త సవాల్!

* సర్కార్ కు పరీక్షగా సీఎస్ ఎంపిక? * ఈ నెలాఖరున రామకృష్ణారావు...

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం కాక‌తీయ‌, హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లాలోని బాటసింగారంలో...

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన ప్రతిపాదించిన ప్రాజెక్టుపై...

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా న్యూ డిల్లీ జూలై...

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు మొన్న యూనివర్సిటీల్లో ఆందోళనలు నిషేధిస్తూ మెమో నేడు...

రాష్ట్రంలో హద్దులు దాటిపోతున్న ఫోన్‌ ట్యాపింగ్‌

రాష్ట్రంలో హద్దులు దాటిపోతున్న ఫోన్‌ ట్యాపింగ్‌ కాంగ్రెస్‌ దూత ఫోన్‌ ట్యాపింగ్‌..! గాంధీ...
spot_img

Popular Categories

spot_imgspot_img