epaper
Sunday, November 16, 2025
epaper

20 ఏళ్ల నిరీక్షణకు తెర

20 ఏళ్ల నిరీక్షణకు తెర
ఫలించిన ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం కృషి
నారాయణపూర్ నిర్వాసితులకు రూ.23.50 కోట్లు మంజూరు

కాకతీయ, కరీంనగర్: ఎల్లంపల్లి ప్రాజెక్ట్‌ కారణంగా ముంపునకు గురైన గంగాధర మండలం నారాయణపూర్, మంగపేట, చెర్లపల్లి (ఎన్) గ్రామాల నిర్వాసితుల 20 ఏళ్ల నిరీక్షణకు చివరికి తెరపడింది. నిర్వాసితుల పరిహారం కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.23.50 కోట్లు మంజూరు చేసిన నేపథ్యంలో గ్రామాల్లో ఆనందం వ్యక్తమవుతోంది.గత ప్రభుత్వ కాలంలో పరిహారం అందజేయడంలో నిర్లక్ష్యం జరిగిందని, అందువల్ల నిర్వాసితులు సంవత్సరాల తరబడి ఎదురుచూసినట్లు గ్రామస్థులు పేర్కొన్నారు. ఎన్నికల సమయంలో పరిహారం తప్పకుండా అందిస్తానని ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం ఇచ్చిన హామీ ప్రకారం, సమస్యను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. అంతేకాక, మంత్రి ఉత్తంకుమార్ రెడ్డిని నారాయణపూర్‌కు తీసుకువెళ్లి ముంపు బాధితుల పరిస్థితిని ప్రత్యక్షంగా చూపించారు.ప్రభుత్వం పరిహారం విడుదల చేయడంతో మూడు గ్రామాల నిర్వాసితులు ఆదివారం మధురనగర్ చౌరస్తాలో సీఎం రేవంత్ రెడ్డి, ఎమ్మెల్యే సత్యం చిత్రపటాలకు పాలాభిషేకం చేసి ఆనందం వ్యక్తం చేశారు. తమ సమస్యలను అర్థం చేసుకొని పరిహారం మంజూరు చేసిన సీఎం, మంత్రికి, అలాగే కృషి చేసిన ఎమ్మెల్యే మేడిపల్లి సత్యానికి నిర్వాసితులు కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో గంగాధర మార్కెట్ కమిటీ చైర్మన్ జాగిరపు రజిత శ్రీనివాస్ రెడ్డి, సింగిల్ విండో చైర్మన్ వెలిచాల తీర్మల్ రావు, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ తోట కరుణాకర్, సింగిల్ విండో వైస్ చైర్మన్ వేముల భాస్కర్, మండల అధ్యక్షుడు పురుమల్ల మనోహర్, బుచ్చన్న, రామిడి రాజిరెడ్డి, బుర్గు గంగన్న, సాగి అజయ్ రావు, సత్తు కనుకయ్య, కర్ర విద్యా సాగర్, తోట సంధ్య, కవిత, వేముల అంజి, బాపు రెడ్డి, మేర్జ కొండయ్య, స్వామి, దికొండ మధు, నగేష్, కొల ప్రభాకర్, మ్యాక వినోద్, మహేష్, గంగివేణి నవీన్ తదితరులు పాల్గొన్నారు

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

బూత్ సమ్మేళనం, యూనిటీ మార్చ్ విజయవంతం చేయాలి

బూత్ సమ్మేళనం, యూనిటీ మార్చ్ విజయవంతం చేయాలి బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంగాడి...

వేములవాడలో ‘శివకారుణ్యం’ ప్రవచనం

వేములవాడలో ‘శివకారుణ్యం’ ప్రవచనం కార్తీక దీపోత్సవంలో ప్రత్యేక కార్యక్రమాలు కాకతీయ, వేములవాడ : వేములవాడ...

మావోయిస్టులు వామపక్షాలు ఏకం కావాలి

మావోయిస్టులు వామపక్షాలు ఏకం కావాలి సిపిఐ నేతలు కాకతీయ, గోదావరిఖని : ప్రజా, కార్మిక...

రోడ్డు ప్రమాదాల నియంత్రణకై డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షలు

రోడ్డు ప్రమాదాల నియంత్రణకై డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షలు జిల్లా ఎస్పీ అశోక్‌కుమార్ కాకతీయ,...

కన్నతండ్రే కాలయముడయ్యాడు

కన్నతండ్రే కాలయముడయ్యాడు అంగవైకల్యంతో ఉన్న ఇద్ద‌రు పిల్ల‌ల‌ను క‌డ‌తేర్చాల‌ని చూసిన తండ్రి కూతురు మృతి,...

మునిసిప‌ల్ ఎన్నిక‌ల్లో ఓటు చోరీకి కుట్ర..

మునిసిప‌ల్ ఎన్నిక‌ల్లో ఓటు చోరీకి కుట్ర.. డబుల్ ఇండ్లు ఓటు బ్యాంకులా మారాయి మాజీ...

జగిత్యాల జిల్లాలో ఎస్సైల బదిలీలు

జగిత్యాల జిల్లాలో ఎస్సైల బదిలీలు కాక‌తీయ‌, జగిత్యాల : జ‌గిత్యాల‌ జిల్లాలో పలువురు...

స్పెషల్ లోక్ అదాలత్‌లో 1861 కేసులకు రాజీ

స్పెషల్ లోక్ అదాలత్‌లో 1861 కేసులకు రాజీ సైబర్ మోసాల్లో కోల్పోయిన రూ.20...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...

రేవంత్ కు కొత్త సవాల్!

* సర్కార్ కు పరీక్షగా సీఎస్ ఎంపిక? * ఈ నెలాఖరున రామకృష్ణారావు...

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం కాక‌తీయ‌, హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లాలోని బాటసింగారంలో...

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన ప్రతిపాదించిన ప్రాజెక్టుపై...

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా న్యూ డిల్లీ జూలై...

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు మొన్న యూనివర్సిటీల్లో ఆందోళనలు నిషేధిస్తూ మెమో నేడు...

రాష్ట్రంలో హద్దులు దాటిపోతున్న ఫోన్‌ ట్యాపింగ్‌

రాష్ట్రంలో హద్దులు దాటిపోతున్న ఫోన్‌ ట్యాపింగ్‌ కాంగ్రెస్‌ దూత ఫోన్‌ ట్యాపింగ్‌..! గాంధీ...
spot_img

Popular Categories

spot_imgspot_img