epaper
Saturday, November 15, 2025
epaper

కాంగ్రెస్ ప్రభుత్వం తోనే గ్రామాలలో నిజమైన అభివృద్ధి

కాంగ్రెస్ ప్రభుత్వం తోనే గ్రామాలలో నిజమైన అభివృద్ధి
నడికూడ మండలంలోని పలు గ్రామాలలో సీసీ రోడ్లు, డ్రైనేజ్
పనులకు శంకుస్థాపన చేసిన పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి

కాకతీయ, పరకాల: నడికూడ మండలంలోని చర్లపల్లి, పులిగిల్ల ,రాయపర్తి, నర్సక్కపల్లి,చౌటుపర్తి, నడికూడ ,ధర్మారం, కంఠాత్మకూర్ గ్రామాలలో 1కోటి43 లక్షలతో చేపట్టిన సిఆర్ఆర్ఎస్సీ సబ్ ప్లాన్ నిధులతో ఎస్సీ కాలనీలలో చేపట్టిన సీసీ రోడ్లు,డ్రైనేజ్ పనులకు పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి శంకుస్థాపన చేశారు. అనంతరం వెంకటేశ్వర్లపల్లి గ్రామం నుండి నర్సింగాపూర్ గ్రామం వరకు ఎస్టిఎస్డిఎఫ్ నిధులతో బీటీ రోడ్డు పనులకు శంకుస్థాపన చేశారు. వెంకటేశ్వర్ల పల్లి గ్రామంలో అంగన్వాడి సెంటర్ ను ఎమ్మెల్యే రేవూరి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. గ్రామాల అభివృద్ధి లక్ష్యంగా కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం కృషి చేస్తోందని,కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వంలోనే గ్రామాల నిజమైన అభివృద్ధి మహర్దశను చేరుకుంటుందని అన్నారు.కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం అన్ని వర్గాల అభివృద్ధికి కట్టుబడి ఉందని,ముఖ్యంగా ఎస్సీ కాలనీలలో మౌలిక సదుపాయాల మెరుగుదల కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా నిధులు కేటాయించినట్లు తెలిపారు.పార్టీలకు అతీతంగా సంక్షేమ పథకాలను అందిస్తున్నామని, ప్రతి కుటుంబం ఆర్థికంగా ఎదిగడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని అన్నారు.గత బిఆర్ఎస్ ప్రభుత్వ పాలకులు అభివృద్ధి పేరుతో దోచుకున్నారని,ధనిక రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చారని అన్నారు. మహిళల ఆర్థిక అభివృద్ధి లక్ష్యంగా పరకాల డైరీ ని ఏర్పాటు చేయబోతున్నామన్నారు. ప్రతి కుటుంబం ఆర్థికంగా ఎదగడమే తమ ప్రభుత్వ లక్ష్యమని, ప్రభుత్వ సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు.కాంగ్రెస్ ప్రభుత్వంలో నూతన రేషన్ కార్డులు,200 యూనిట్ల ఉచిత విద్యుత్, రైతు రుణమాఫీ, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రైతు బీమా, సన్న వడ్లకు రూ 500 బోనస్, మహాలక్ష్మి గ్యాస్ సబ్సిడీ, వడ్డీ లేని రుణాలు, శ్రీనిధి రుణాలు, ఇందిరమ్మ ఇల్లు, సీఎంఆర్ఎఫ్ ,కళ్యాణ లక్ష్మి, తదితర సంక్షేమ పథకాలను పార్టీలకు అతీతంగా అందజేస్తున్నామనితెలిపారు.అలాగే వెంకటేశ్వర్ల పల్లి, నార్లాపూర్, రాయపర్తి, చర్లపల్లి, నడికూడ గ్రామాలలో పిఎసిఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు.రైతులు దళారులను నమ్మి మొసపోవద్దని, కొనుగోలు కేంద్రాల్లోనే మద్దతు ధర లభిస్తుందని అన్నారు.
ఈ కార్యక్రమం లో కాంగ్రెస్ పార్టీ నాయకులు, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

రామప్ప ఆల‌యానికి నెదర్లాండ్ దంపతులు

రామప్ప ఆల‌యానికి నెదర్లాండ్ దంపతులు కాకతీయ, ములుగు ప్రతినిధి: యునెస్కో వరల్డ్ హెరిటేజ్...

రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి

రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి కాకతీయ, దుగ్గొండి: రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి...

ఘనంగా స్వయం పరిపాలన దినోత్సవం

ఘనంగా స్వయం పరిపాలన దినోత్సవం కాకతీయ,నర్సింహులపేట: మండలంలోని ఎంపీయుపిఎస్ పడమటిగూడెం,మండల కేంద్రంలోని జిల్లాపరిషత్...

అయ్యప్ప స్వామి కుటీరం గృహప్రవేశం

అయ్యప్ప స్వామి కుటీరం గృహప్రవేశం కాకతీయ,నర్సింహులపేట: మండల కేంద్రంలోని శ్రీవెంకటేశ్వర స్వామి ఆలయం...

చెట్లను తొలగించిన వారిని అరెస్టు చేయాలి…

చెట్లను తొలగించిన వారిని అరెస్టు చేయాలి... కాకతీయ, రాయపర్తి /వర్ధన్నపేట : వర్ధన్నపేట...

డిజిటల్ బోధనతో అవగాహన పెంపొందుతుంది

డిజిటల్ బోధనతో అవగాహన పెంపొందుతుంది కాకతీయ, నెల్లికుదురు : డిజిటల్ బోధనతో విద్యార్థుల్లో...

మండలంలో ఘనంగా స్వపరిపాలన దినోత్సవం

మండలంలో ఘనంగా స్వపరిపాలన దినోత్సవం కాకతీయ, పెద్దవంగర : మండల కేంద్రంలోని పలు...

భద్రకాళి చేరువుపై రోప్ వే, గ్లాస్ బ్రిడ్జ్

భద్రకాళి చేరువుపై రోప్ వే, గ్లాస్ బ్రిడ్జ్ ప్రజెంటేషన్ లను సమీక్షించిన కూడా...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...

రేవంత్ కు కొత్త సవాల్!

* సర్కార్ కు పరీక్షగా సీఎస్ ఎంపిక? * ఈ నెలాఖరున రామకృష్ణారావు...

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం కాక‌తీయ‌, హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లాలోని బాటసింగారంలో...

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన ప్రతిపాదించిన ప్రాజెక్టుపై...

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా న్యూ డిల్లీ జూలై...

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు మొన్న యూనివర్సిటీల్లో ఆందోళనలు నిషేధిస్తూ మెమో నేడు...

రాష్ట్రంలో హద్దులు దాటిపోతున్న ఫోన్‌ ట్యాపింగ్‌

రాష్ట్రంలో హద్దులు దాటిపోతున్న ఫోన్‌ ట్యాపింగ్‌ కాంగ్రెస్‌ దూత ఫోన్‌ ట్యాపింగ్‌..! గాంధీ...
spot_img

Popular Categories

spot_imgspot_img