విద్యుత్ షాక్ తగిలి గొర్రెల కాపరి మృతి
కాకతీయ,నర్సింహులపేట: గొర్రెలు మేపడానికి వెళ్లి ఊదరి యాదగిరి(64)చనిపోయిన సంఘటన నర్సింహులపేట శివారు పామాయిల్ తోటలో బుధవారం చోటుచేసుకుంది. సమాచారం తెలుసుకున్న కుటుంబ సభ్యులు వెళ్లి చూడగా శరీరంపై విద్యుత్ షాక్ తగిలి కాలిన గాయాలతో చనిపోయి ఉండడాన్ని గమనించారు.కుమారుడు ఉదరి అనిల్ తన తండ్రి మరణం పై కరెంట్ షాక్ తగిలి చనిపోయినట్లు అనుమానం ఉన్నదని ఫిర్యాదు చేసినట్లు ఎస్సై సురేష్ తెలిపారు.అనిల్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి విచారణ చేపట్టినట్లు ఎస్సై తెలిపారు.


