epaper
Friday, November 14, 2025
epaper

జూబ్లీహిల్స్ హ‌స్త‌గ‌తం

జూబ్లీహిల్స్ హ‌స్త‌గ‌తం
ఎగ్జిట్ పోల్స్ వెల్ల‌డించిన స‌ర్వే సంస్థ‌లు
అన్నింట్లోనూ అధికార పార్టీకి స్పష్టమైన ఆధిక్యం
రెండోస్థానంలో బీఆర్ఎస్‌.. పోటీ ఇవ్వ‌ని బీజేపీ
ప్ర‌శాంతంగా ముగిసిన ఉప ఎన్నిక పోలింగ్
సాయంత్రం 5 గంట‌ల వ‌ర‌కు 47.16 శాతం పోలింగ్
ప‌లుచోట్ల కాంగ్రెస్‌, బీఆర్ఎస్‌ శ్రేణుల మ‌ధ్య వాగ్వాదం
ఈనెల 14న ఫ‌లితాలు

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : తెలుగు రాష్ట్రాల్లో ఉత్కంఠ రేపుతున్న జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సంబంధించి ఎగ్జిట్ పోల్ రిజల్ట్స్ వచ్చేశాయి. దాదాపు అన్ని సర్వే సంస్థలూ అధికార పార్టీకి జై కొట్టాయి. కాంగ్రెస్ పార్టీ గెలిచే అవకాశం ఉందని ఎక్కువ సర్వే సంస్థలు చెబుతున్నాయి. చాణక్య స్టేటజీస్ సంస్థ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని తెలిపింది. కాంగ్రెస్‌కు 46 శాతం, బీఆర్ఎస్ కు 41 శాతం అలాగే బీజేపీకు 06 శాతంగా అంచనా వేసింది. పీపుల్స్ పల్స్ సంస్థ.. కాంగ్రెస్ 48 శాతం, బీఆర్ఎస్ 41 శాతం, బీజేపీ 06 శాతం అని తేల్చింది. అలాగే స్మార్ట్ పోల్ సంస్థ అంచనాలను చూస్తే.. కాంగ్రెస్ 48.2 శాతం అలాగే బీఆర్ఎస్ 42.1 శాతం ఇక బీజేపీ 06 శాతం ఓట్లు వచ్చినట్లు స్పష్టం చేసింది. నాగన్న సర్వే వివరాలు చూస్తే.. కాంగ్రెస్ కు 47 శాతం ఓట్లు వచ్చినట్లు తేల్చింది. బీఆర్ఎస్ కు 41 శాతం, బీజేపీ కు 08 శాతం ఓట్లు పడినట్లు అంచనా వేసింది. జన్ మైన్ సర్వే కూడా కాంగ్రెస్ పార్టీకే అధికారం కట్టబెట్టింది. పబ్లిక్ పల్స్ (శ్రీనివాస్) సర్వే.. కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని పేర్కొంది. ఉదయం నుంచి వచ్చిన ఎగ్జిట్ పోల్స్ ప్రకారం జూబ్లీహిల్స్‌లో కాంగ్రెస్‌కు స్పష్టమైన ఆధిక్యం ఉన్నట్లు సర్వేలు తేల్చి చెప్పాయి. మొత్తంగా జూబ్లీహిల్స్‌లో కాంగ్రెస్‌కు స్పష్టమైన ఆధిక్యం కనిపిస్తోంది.

ప్ర‌ధాన పార్టీల హోరాహోరీ

2023 అసెంబ్లీ ఎన్నికల్లో జూబ్లీహిల్స్ నుంచి విజయం సాధించిన మాగంటి గోపినాథ్ ఆకస్మిక మరణంతో అక్కడ ఉప ఎన్నిక అనివార్యమైంది. జూబ్లీహిల్స్ ఉప ఎన్ని బరిలో 58 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. ప్రధాన పార్టీలైన బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీలు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. బీఆర్ఎస్ నుంచి గోపినాథ్ సతీమణి సునీత, కాంగ్రెస్ నుంచి నవీన్ యాదవ్, బీజేపీ నుంచి ఎల్ దీపక్ రెడ్డిలు బరిలో నిలిచారు. ఎన్డీయే కూటమిలో భాగస్వామిగా ఉన్న జనసేన పార్టీ తమ మద్దతు బీజేపీ అభ్యర్థి దీపక్ రెడ్డికి ఉంటుందని ప్రకటించింది. ఇక, కాంగ్రెస్‌ అభ్యర్థి నవీన్ యాదవ్‌కు ఎంఐఎం మద్దతు ఇచ్చింది.

50 శాతం పోలింగ్ దాటే అవ‌కాశం

జూబ్లీహిల్స్​ఉప ఎన్నిక పోలింగ్ ​ముగిసింది. సాయంత్రం 5 వరకు 47.16 శాతం పోలింగ్ నమోదైంది. సాయంత్రం 6 గంటలలోపు క్యూ లైన్లలో ఉన్నవారికి ఓటు వేసే అవకాశం కల్పిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. జూబ్లీహిల్స్ చరిత్రను పరిశీలిస్తే.. ఇక్కడ పోలింగ్ శాతం ఎప్పుడూ తక్కువగా ఉంటుంది. గత ఎన్నికల్లో (2023) 47.58% ఓట్లు మాత్రమే పోలయ్యాయి. ఈ ఉప ఎన్నికలో పోలింగ్ సుమారుగా 50 శాతానికిపైగా నమోదు అవ్వనున్నట్లు అధికారులు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. ఇందుకు సంబంధించి ఎన్నికల అధికారులు వివరాలు వెల్లడించాల్సి ఉంది. ఇక, జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు నవంబర్ 14న జరగనుంది.

బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య వాగ్వాదం

అయితే పోలింగ్ సందర్బంగా కొన్నిచోట్ల బీఆర్ఎస్, కాంగ్రెస్ శ్రేణుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత అధికార కాంగ్రెస్‌పై తీవ్ర ఆరోపణలు చేశారు. కాంగ్రెస్ నేత‌లు నిబంధ‌న‌లు ఉల్లంఘించి దొంగ ఓట్లు వేయిస్తున్నార‌ని, దొంగ ఓట‌ర్ల‌కు పోలీసులు స‌హ‌క‌రిస్తున్నారని ఆరోపించారు. తాము దొంగ ఓట‌ర్ల‌ను రెడ్ హ్యాండెడ్‌గా ప‌ట్టుకుని పోలీసుల‌కు, ఎన్నిక‌ల అధికారుల‌కు ఫిర్యాదు చేసినా ఎలాంటి చ‌ర్య‌లు తీసుకోవ‌డం లేద‌ని చెప్పుకొచ్చారు. కాంగ్రెస్ పార్టీ రౌడీ షీటర్లతో దౌర్జన్యాలకు పాల్పడుతుందని సంచలన ఆరోపణలు చేశారు. తమ పార్టీ కార్యకర్తలను కొట్టి, తిరిగివారి మీదనే కేసులు పెడతామని కాంగ్రెస్ నేతలు బెదిరిస్తున్నారని ఆరోపించారు. బీఆర్ఎస్ ఆరోపణలను కాంగ్రెస్ ఖండించింది. మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ… ‘‘జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రజాస్వామ్యంగా జరగాలని ఆకాంక్షించే పార్టీ కాంగ్రెస్. బీఆర్ఎస్ అభ్యర్థి ఓడిపోతున్నామని అసహనంతో మూడు రోజులుగా ఏది పడితే అది మాట్లాడుతున్నార‌ని మండిప‌డ్డారు.

మొబైల్ స్క్కాడ్‌లు.. డ్రోన్ నిఘా..

జూబ్లీహిల్స్ నియోజవర్గంలో మొత్తం 4,01,365 మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో పురుషులు 2,08,561, మహిళలు 1,92,779, ఇతరులు 25 మంది ఉన్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కోసం మొత్తంగా 407 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేశారు. ఇందులో 11 స్టేషన్‌లో 1,200 మంది కంటే ఎక్కువ మంది ఓటర్లు ఓటు హక్కు వినియోగించనున్నారు. గరిష్టంగా పోలిగ్ స్టేషన్‌ 9 పరిధిలో 1,233 మంది ఓటర్లు, కనిష్టంగా పోలింగ్ స్టేషన్ 263 పరిధిలో 540 మంది ఓటర్లు ఉన్నారు. ఈ ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించేందుకు 19 మంది నోడల్ అధికారులను, 38 మంది సెక్టార్ అధికారులను నియమించారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రశాంతంగా నిర్వహించేందుకు భారీగా భద్రత చర్యలు చేపట్టారు. 1,700కు పోలీసు సిబ్బంది, 8 కంపెనీలు సీఐఎస్‌ఎఫ్ సిబ్బందిని మోహరించారు. ఓటింగ్ సజావుగా జరిగేలా చూసేందుకు మొబైల్ స్క్వాడ్‌లు, డ్రోన్ నిఘాను కూడా ఉపయోగించారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

కాంగ్రెస్‌లో రేవంత్ జోష్‌

కాంగ్రెస్‌లో రేవంత్ జోష్‌ జూబ్లీహిల్స్ పీఠంపై హ‌స్తం పార్టీ జెండా ఉప ఎన్నిక గెలుపుతో...

హీరో నాగార్జునపై కామెంట్స్ చేస్తూ మంత్రి సురేఖ ట్వీట్…

హీరో నాగార్జునపై కామెంట్స్ చేస్తూ మంత్రి సురేఖ ట్వీట్... https://twitter.com/iamkondasurekha/status/1988313863826379169 కాకతీయ, వరంగల్ సిటీ...

హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అరెస్ట్

హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అరెస్ట్ జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో ఉద్రిక్తత కాకతీయ, హుజురాబాద్:...

మాగంటి సునిత ఎమోష‌న‌ల్ వీడియో..!

మాగంటి సునిత ఎమోష‌న‌ల్ వీడియో..! జూబ్లీహిల్స్ ఓట‌ర్ల‌కు విజ్ఞ‌ప్తి.. కాక‌తీయ‌, హైదరాబాద్ : జూబ్లీహిల్స్...

కాంగ్రెస్ పార్టీ దొంగ ఓట్లు వేయాల‌ని చూస్తోంది

https://twitter.com/TeluguScribe/status/1987795147560722497 కాంగ్రెస్ పార్టీ దొంగ ఓట్లు వేయాల‌ని చూస్తోంది ఫేక్ స్లిప్పుల‌ను ఎన్నిక‌ల అధికారికి...

అద్దె చెల్లించలేదు.. ప్ర‌భుత్వ పాఠ‌శాల‌కు తాళం..!

అద్దె చెల్లించలేదు.. ప్ర‌భుత్వ పాఠ‌శాల‌కు తాళం..! https://twitter.com/TeluguScribe/status/1987768671163629993 కాక‌తీయ‌, వెబ్‌డెస్క్ : అద్దె చెల్లించకపోవడంతో...

చలి పంజా

చలి పంజా రాష్ట్ర వ్యాప్తంగా పడిపోయిన ఉష్ణోగ్ర‌త‌లు కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : తెలంగాణలో...

రేవంత్ రెడ్డి, బండి సంజయ్ బూత్ బ్రదర్స్

రేవంత్ రెడ్డి, బండి సంజయ్ బూత్ బ్రదర్స్ కాంగ్రెస్, బీజేపీది ఫెవికాల్ బంధం ముఖ్యమంత్రి...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...

రేవంత్ కు కొత్త సవాల్!

* సర్కార్ కు పరీక్షగా సీఎస్ ఎంపిక? * ఈ నెలాఖరున రామకృష్ణారావు...

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం కాక‌తీయ‌, హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లాలోని బాటసింగారంలో...

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన ప్రతిపాదించిన ప్రాజెక్టుపై...

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా న్యూ డిల్లీ జూలై...

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు మొన్న యూనివర్సిటీల్లో ఆందోళనలు నిషేధిస్తూ మెమో నేడు...

రాష్ట్రంలో హద్దులు దాటిపోతున్న ఫోన్‌ ట్యాపింగ్‌

రాష్ట్రంలో హద్దులు దాటిపోతున్న ఫోన్‌ ట్యాపింగ్‌ కాంగ్రెస్‌ దూత ఫోన్‌ ట్యాపింగ్‌..! గాంధీ...
spot_img

Popular Categories

spot_imgspot_img