epaper
Thursday, January 15, 2026
epaper

కేసీఆర్ క‌ట్టించిన ఇళ్ల‌నే ఇస్తున్న‌రు : మన్నె గోవర్ధన్ రెడ్డి

కేసీఆర్ క‌ట్టించిన ఇళ్ల‌నే ఇస్తున్న‌రు
`ఇందిర‌మ్మ`పై ఎలాంటి పురోగ‌తి లేదు
బీ ఆర్ ఎస్ నేత మన్నె గోవర్ధన్ రెడ్డి

కాకతీయ, తెలంగాణ బ్యూరో : రేవంత్ పాలన ప్రజా పాలన కాదని, ప్రజా భక్షక పాలన అని బీ ఆర్ ఎస్ సీనియర్ నేత మన్నె గోవర్ధన్ రెడ్డి తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ అధికారం లోకి వచ్చి 20 నెలలు దాటినా ఇందిరమ్మ ఇండ్లపై ఎలాంటి పురోగతి లేదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ కట్టించిన ఇళ్లను మాత్రమే ఇప్పుడు పంపిణీ చేస్తున్నారని ఆరోపించారు. వరంగల్ ప‌శ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి సైతం ఇదే విషయాన్ని అంగీకరించారని తెలిపారు. సంవత్సరానికి 4 లక్షల ఇళ్లు కడతామని చెప్పి, ఆ దిశగా ఒక్క అడుగు కూడా వేయలేదని మండిపడ్డారు. కాంగ్రెస్ నేతలు ప్రచార యావకే పరిమితమై, తమ కార్యకర్తలకే ఇళ్లు కేటాయిస్తున్నారని విమర్శించారు. రేషన్ కార్డుల విషయంలో కూడా కాంగ్రెస్ అబద్ధాలు ప్రచారం చేస్తోందని, హైదరాబాద్‌లో దరఖాస్తు చేసిన వారిలో కేవలం 53 వేల మందికే ఇచ్చారని అన్నారు. ఎన్నికల కోసమే హడావుడిగా పంపిణీ చేస్తున్నారని విమర్శించారు. కేసీఆర్ హయాంలో 6.47 లక్షల రేషన్ కార్డులు జారీ చేశామని గుర్తు చేశారు. హైదరాబాద్‌లో వర్షాలతో ప్రజలు ఇబ్బంది పడుతున్నా, ప్రభుత్వం పట్టించుకోవడం లేదని గోవర్ధన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. రోడ్లపైనే కాకుండా వంతెనలపై కూడా నీరు నిలిచే పరిస్థితి ఏర్పడిందని, చిన్న చిన్న నిర్వహణ పనులు కూడా చేయలేని స్థితి వచ్చిందని అన్నారు. కేసీఆర్, కేటీఆర్ చొరవతో హైదరాబాద్‌లో గత 10 ఏళ్లలో 50 వేల కోట్ల రూపాయల అభివృద్ధి జరిగిందని, ఎస్‌ఆర్‌డీపీ కింద ఫ్లైఓవర్లు, అండర్‌పాస్‌లు నిర్మాణం వలన ట్రాఫిక్ సమస్య తగ్గిందని గుర్తు చేశారు. రేవంత్ నిర్లక్ష్యం వలన మళ్లీ సమస్యలు పెరుగుతున్నాయని అన్నారు. సీఎం రేవంత్ విద్యాశాఖ, మున్సిపల్ శాఖ, హోంశాఖలో విఫలమయ్యారని, చేయలేక పోతే పదవి నుంచి దిగిపోవాలని డిమాండ్ చేశారు. హోమ్ మంత్రిగా ప్రతిపక్షాలపై కేసులు పెట్టడమే ఆయన పని అయిపోయిందని, కొంతమంది అధికారులు కూడా కాంగ్రెస్ నేతల ఇష్టానుసారం ప్రవర్తిస్తున్నారని ఆరోపించారు. ఎలాగూ రాబోయేది బీ ఆర్ ఎస్ ప్రభుత్వమే. తప్పు చేసిన అధికారులపై తప్పనిసరిగా చర్యలు తీసుకుంటాం అని ఆయ‌న‌ హెచ్చరించారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

రైతు ఐడీ తప్పనిసరి!

రైతు ఐడీ తప్పనిసరి! 2026 నుంచి పీఎం కిసాన్ లబ్ధికి షరతు అగ్రిస్టాక్‌తో డిజిటల్...

మేడారం జాతరకు ఏర్పాట్లు పూర్తి చేయాలి

మేడారం జాతరకు ఏర్పాట్లు పూర్తి చేయాలి భక్తులకు అసౌకర్యం లేకుండా చూడాలి క్యూ లైన్...

అలుగునూర్ చౌరస్తాలో ఎలక్ట్రిక్ బస్సు ప్రమాదం

అలుగునూర్ చౌరస్తాలో ఎలక్ట్రిక్ బస్సు ప్రమాదం డ్రైవర్ నిర్లక్ష్యమే కారణమంటున్న స్థానికులు కాకతీయ, కరీంనగర్...

నూతన సర్పంచ్ రాధిక శ్రీనివాస్‌కు సన్మానం

నూతన సర్పంచ్ రాధిక శ్రీనివాస్‌కు సన్మానం కాకతీయ, గణపురం : మేజర్ గ్రామపంచాయతీ...

పీఎంవో ఆఫీస్ ఇక సేవాతీర్థ్..

పీఎంవో ఆఫీస్ ఇక సేవాతీర్థ్.. పేరు మార్చుతూ కేంద్రం నిర్ణయం కొత్త భవనంలోకి మారనున్న...

స‌ర్పంచ్ నామినేష‌న్లు 25,654

స‌ర్పంచ్ నామినేష‌న్లు 25,654 వార్డుల‌కు 82, 276 4,236 పంచాయతీలకు కొనసాగుతున్న ఎన్నికల ప్రక్రియ 11న...

విద్యార్థులు సృజనాత్మకంగా ఆలోచించాలి

విద్యార్థులు సృజనాత్మకంగా ఆలోచించాలి కలెక్టర్ పమేలా సత్పతి జిల్లా స్థాయి బాల వైజ్ఞానిక ప్రదర్శన...

జిల్లెళ్ల చెక్‌పోస్ట్‌లో ఎస్పీ మహేష్ బి.గితే ఆకస్మిక తనిఖీ

జిల్లెళ్ల చెక్‌పోస్ట్‌లో ఎస్పీ మహేష్ బి.గితే ఆకస్మిక తనిఖీ కాకతీయ, రాజన్న సిరిసిల్ల...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...

రేవంత్ కు కొత్త సవాల్!

* సర్కార్ కు పరీక్షగా సీఎస్ ఎంపిక? * ఈ నెలాఖరున రామకృష్ణారావు...

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం కాక‌తీయ‌, హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లాలోని బాటసింగారంలో...

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన ప్రతిపాదించిన ప్రాజెక్టుపై...

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా న్యూ డిల్లీ జూలై...

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు మొన్న యూనివర్సిటీల్లో ఆందోళనలు నిషేధిస్తూ మెమో నేడు...

రాష్ట్రంలో హద్దులు దాటిపోతున్న ఫోన్‌ ట్యాపింగ్‌

రాష్ట్రంలో హద్దులు దాటిపోతున్న ఫోన్‌ ట్యాపింగ్‌ కాంగ్రెస్‌ దూత ఫోన్‌ ట్యాపింగ్‌..! గాంధీ...
spot_img

Popular Categories

spot_imgspot_img