epaper
Monday, March 2, 2026
epaper

ఒకేరోజు 3ఆల‌యాల‌కు అంబానీ రికార్డు డొనేషన్..లిస్ట్‌లో తిరుమ‌ల‌!

ఒకేరోజు 3ఆల‌యాల‌కు అంబానీ రికార్డు డొనేషన్..లిస్ట్‌లో తిరుమ‌ల‌!

కాక‌తీయ‌, జాతీయం : దేశంలోనే అత్యంత సంపన్నుడిగా, ప్రపంచ ప్రఖ్యాత పారిశ్రామికవేత్తగా నిలిచిన ముఖేశ్ అంబానీ గురించి చెప్పాల్సిన అవసరమే లేదు. రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేతగా ఆయన బిజినెస్‌ రికార్డులు క్రియేట్ చేస్తూనే, సేవా కార్యక్రమాల్లో కూడా ముందుంటారు. ఆధ్యాత్మికత, దాతృత్వం.. ఈ రెండు అంశాల కలయికతో అంబానీ తరచూ వార్తల్లో నిలుస్తుంటారు. ఆదివారం కూడా అదే జరిగింది. ఒకేరోజు మూడు రాష్ట్రాల్లోని మూడు ప్రసిద్ధ ఆలయాలకు మొత్తం రూ.165 కోట్లకు పైగా విరాళాలు ప్రకటించి హెడ్‌లైన్స్ లో నిలిచారు.

ఆదివారం వేకువజామున తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ముఖేశ్ అంబానీ, అనంతరం అద్భుతమైన సద్వినియోగంతో కూడిన దాతృత్వాన్ని ప్రదర్శించారు. తిరుమలలో నిత్యం రెండు లక్షల మందికి అన్నప్రసాదాలు తయారు చేసేందుకు అత్యాధునిక శాటిలైట్ కిచెన్‌ నిర్మాణానికి రూ.100 కోట్లు విరాళంగా ప్రకటించారు. ఈ నూత‌న‌ వంటశాల అన్నప్రసాదం ట్రస్టుకు అంకితం కానుందని, ఇది అంబానీ కుటుంబం తరఫున భక్తి చిహ్నంగా ఉండబోతోందని రిలయన్స్ ప్రకటించింది.

తిరుమల దర్శనం తర్వాత ముఖేశ్ అంబానీ రాజస్థాన్‌లోని నాథ్‌ద్వారా ఆలయాన్ని సందర్శించారు. అక్కడ భక్తుల సౌకర్యార్థం యాత్రికుల సముదాయం నిర్మాణానికి ముందుకు వచ్చారు. మొత్తం రూ.50 కోట్ల వ్యయంతో రానున్న ఈ ప్రాజెక్ట్‌ మూడు సంవత్సరాల్లో పూర్తికానుంది. తొలి విడతగా రూ.15 కోట్ల చెక్కును అంబానీ దేవస్థానానికి అందజేశారు.

ఆ తర్వాత కేరళలోని ప్రసిద్ధ గురువాయూర్‌ శ్రీకృష్ణ ఆలయాన్ని దర్శించిన అంబానీ, అక్కడ కూడా ప్రజా సేవలో భాగంగా మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మాణానికి తన వంతు సహాయం చేశారు. తొలి విడతగా రూ.15 కోట్ల చెక్కును ఆలయ అధికారులకు అందజేశారు. మొత్తానికి తిరుమలలో అన్నదానం, నాథ్‌ద్వారాలో వసతి, గురువాయూరులో వైద్యం – ఈ మూడు రంగాల్లో అంబానీ చేసిన విరాళాలు కేవలం దాతృత్వం కాదు, సమాజం పట్ల ఉన్న ఆయన బాధ్యతను ప్రతిబింబిస్తున్నాయి. బిజినెస్‌ ప్రపంచంలో అగ్రస్థానంలో ఉన్నా, భక్తి మార్గంలో సాదాసీదా యాత్రికుడిలా ఉండే అంబానీ… మరోసారి ప్రజల మనసులు గెలుచుకున్నారు. ఇక ఒకేరోజు మూడు దేవాలయాల్లో రికార్డు డొనేష‌న్స్ ఇచ్చిన అంబానీపై సోషల్ మీడియాలో ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

రూ.1000 దాటితే యూపీఐపై ఛార్జీలు?.. ఎన్‌పీసీఐ క్లారిటీ

రూ.1000 దాటితే యూపీఐపై ఛార్జీలు?.. ఎన్‌పీసీఐ క్లారిటీ సాధారణ యూపీఐ లావాదేవీలపై ఎలాంటి...

బెంగళూరు ‘లేడీ డాన్’ యశస్వినీ గౌడ అరెస్ట్

బెంగళూరు ‘లేడీ డాన్’ యశస్వినీ గౌడ అరెస్ట్ రియల్ ఎస్టేట్ వ్యాపారి కిడ్నాప్...

ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం

ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం వారంలోగా అమ‌ల్లోకి.. మూడునాలుగు రోజుల్లోనే సంతకాలు భారత్‌-అమెరికా సంయుక్త...

మీకు ఏది సరైనదనిపిస్తే అదే చేయండి

మీకు ఏది సరైనదనిపిస్తే అదే చేయండి కీలక ప్రశ్నలకు మోదీ సమాధానం ఇవ్వలేదు ప్ర‌ధాని...

మద్రాస్ హైకోర్టులో విజయ్‌కు షాక్‌

మద్రాస్ హైకోర్టులో విజయ్‌కు షాక్‌ రూ.1.50 కోట్ల పెనాల్టీ చెల్లించాల్సిందేన‌న్న న్యాయ‌స్థానం భారీ జరిమానాను...

పాకిస్థాన్‌లో ఆత్మాహుతి దాడి

పాకిస్థాన్‌లో ఆత్మాహుతి దాడి 31 మంది మృతి.. 170 మందికి గాయాలు క్ష‌త‌గాత్రుల్లో ప‌లువురి...

విమాన ప్రమాదంలో అజిత్ పవార్ మృతి

విమాన ప్రమాదంలో అజిత్ పవార్ మృతి ల్యాండ్ అవుతుండ‌గా రన్‌వేపై కుప్ప‌కూలిన చార్టర్డ్...

కర్తవ్యపథ్‌పై గర్వభారతం!

కర్తవ్యపథ్‌పై గర్వభారతం! డెబ్బై ఏడవ గణతంత్ర వేడుకలు ఘనంగా ప్రారంభం రాజ్యాంగ ఆత్మకు ప్రతీకగా...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!?

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!? సీజ్ చేసిన క‌ల‌ప‌ మాయం..?! ములుగు జిల్లా అట‌వీశాఖ‌లో క‌ల‌క‌లం వేరే...

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్ 116 మునిసిపాలిటీలు.. 7కార్పోరేష‌న్ల‌లో న‌మోదైన పోలింగ్ శాతం వివ‌రాలు ఒక్క...

ఔష‌ధం కాదు.. ! విషం..!!

ఔష‌ధం కాదు.. ! విషం..!! తెలంగాణలో తయారైన 35ర‌కాల మందులు ఫెయిల్‌ సీడీఎస్‌సీవో తనిఖీల్లో...

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..!

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..! చరిత్రకు జానపద స్వరం..అద్భుతం పాట రూపంలో సమ్మక్క–సారలమ్మ...

మేడారంలో హైటెక్ భద్రత

మేడారంలో హైటెక్ భద్రత మూడు కోట్ల మందికిపైగా భక్తుల రాక అంచనా కమాండ్ కంట్రోల్...

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...
spot_img

Popular Categories

spot_imgspot_img