epaper
Monday, March 2, 2026
epaper

అక్రమార్కులు అప్ర‌మ‌త్తం

అక్రమార్కులు అప్ర‌మ‌త్తం
నిద్ర మైకంలో మైనింగ్ అధికారులు
మ‌ల్లంప‌ల్లి మ‌ట్టి దందాలో జాగ్ర‌త్త ప‌డుతున్న‌ దొంగ‌లు
కాక‌తీయ క‌థ‌నాల‌తో అక్ర‌మార్కులు అల‌ర్ట్
రాత్రికి రాత్రే టిప్పర్, జేసీబీ టైర్ల గుర్తులు చెరిపేసే ప్ర‌య‌త్నం
విజిలెన్స్ అధికారులు, కలెక్టర్ దృష్టిసారించేనా..?

కాకతీయ, ములుగు ప్రతినిధి : ములుగు జిల్లా మల్లంపల్లి మండల పరిధిలో మైనింగ్ మాఫియా అక్రమ తవ్వకాలకు పాల్పడుతున్నా, అధికారులు మాత్రం కనీస కదలిక చూపకపోవడం స్థానికుల్లో ఆగ్రహం క‌లిగిస్తోంది. ప్రభుత్వ అనుమతులు ముగిసిన క్వారీలను మూసివేయాల్సింది పోయి, కొందరు రాజకీయ వ్యాపారవేత్తలు రాత్రింబగళ్లు భారీ యంత్రాలతో తవ్వకాలు కొనసాగిస్తూ కోట్ల రూపాయల లాభాలు గడిస్తున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. మల్లంపల్లి, శ్రీనగర్, రామచంద్రాపురం, దేవనగర్ గ్రామాల పరిసర ప్రాంతాల్లో ఉన్న లాటరైట్, డోలమైట్ మైనింగ్ క్వారీలలో ఈ అక్రమ తవ్వకాలు జరుగుతున్నట్లు సమాచారం. లీజు గడువు ముగిసినా కూడా ఎస్కవేటర్‌ లతో ఎర్ర మట్టిని తవ్వి, టిప్పర్ లలో లోడ్ చేసి రాత్రివేళల్లో వేరుజిల్లాలకు తరలిస్తున్నారు. మూడు రోజులుగా కాకతీయ దినపత్రిక ఈ అంశంపై వరుస కథనాలు ప్రచురించగా, పై అధికారుల ఒత్తిడి మేరకు గనులు మరియు భూగర్భశాఖ అధికారులు క్షేత్రస్థాయిలో సరైన విచారణ చేయకుండానే “అక్రమ తవ్వకాలు ఏవీ లేవు” అంటూ వివరణ ఇవ్వడం గ‌మ‌నార్హం. ఈ నేపథ్యంలో మట్టి తవ్వకాలు జరిగిన ప్రాంతాలను ఆధారాలతో స‌హా క‌థ‌నంలో పేర్కొంటూ శుక్ర‌వారంసాయంత్రం కాక‌తీయ వెబ్సైట్‌లో మ‌రోసారి ప్ర‌చురించింది. అక్కడ ఎక్స్‌క‌వేట‌ర్‌, టిప్పర్ గుర్తులు ఉన్నాయి అంటూ సాక్ష్యాలతో రుజువు చేయడానికి సిద్ధమని కాకతీయ పేర్కొంది. అయితే ఈ సమాచారం బహిర్గ‌త‌మైన వెంట‌నే శనివారం రాత్రి మట్టి మాఫియా మూసివేయాల్సిన క్వారీ నుంచి అక్రమంగా మట్టి తవ్విన ఎస్కవేటర్‌ను అక్కడి నుంచి తొలగించి, టిప్పర్‌ రవాణా గుర్తులను చెరిపేసేందుకు విఫ‌ల‌య‌త్నం చేయ‌డం గ‌మ‌నార్హం. పత్రికలో కథనం వెలువడిన వెంటనే అక్రమార్కులు మేల్కొని తవ్వకాలకు సంబంధించిన ఆనవాళ్లను దాచేందుకు ప్రయత్నిస్తుండగా, అధికారులు మాత్రం మౌనం వహించడం సర్వత్ర విమర్శలకు దారి తీస్తోంది.

అధికారుల నిర్లక్ష్యం…. ప్రజల్లో ఆగ్రహం….

ప్రభుత్వానికి భారీ నష్టం వాటిల్లుతున్నప్పటికీ, సంబంధిత మైనింగ్ అధికారులు ఏ విధమైన చర్యలు తీసుకోవడం లేదు అని, క్వారీల వద్ద తవ్వకాలు కొనసాగుతున్నాయా లేదా అన్న విషయంపై క్షేత్రస్థాయిలో తనిఖీలు జరపకపోవడం వారి బాధ్యతా రాహిత్యాన్ని బయటపెడుతోంది అని, అధికారుల కళ్ళముందే మట్టి దోపిడీ జరుగుతోంది అని, అధికారులు చూడనట్లు నటిస్తున్నారు అని, పైస్థాయి ఒత్తిళ్ల వల్ల చర్యలు తీసుకోవడంలేదు అని మండిపడ్డారు. మైనింగ్ అధికారుల పర్యవేక్షణ అనంతరం మట్టి మాఫియా టిప్పర్ గుర్తులను జరిపేయడం పట్ల అధికారుల అండదండల తో అక్రమ మట్టి తవ్వకాలు జరుగుతున్నాయని స్థానికులు భావిస్తున్నారు.

విజిలెన్స్, కలెక్టర్ జోక్యం అవసరం…

మల్లంపల్లి చుట్టుపక్కల ప్రాంతాల్లో జరుగుతున్న ఈ అక్రమాలపై జిల్లా కలెక్టర్‌, విజిలెన్స్ అధికారులు స్వయంగా దృష్టి సారించాలని ప్రజలు కోరుతున్నారు. అనధికారిక మట్టి తవ్వకాలు జరిగాయా లేదా అన్న విషయంపై ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసి క్షేత్రస్థాయిలో విచారణ జరిపిస్తే, నిజా నిజాలు వెలుగులోకి వస్తాయని అభిప్రాయపడ్డారు. అలాగే విజిలెన్స్ అధికారులు ఆకస్మిక దాడులు నిర్వహిస్తే, అక్రమ తవ్వకాలకు చెక్ పడుతుందని, మైనింగ్ మోసాల వెనుక ఉన్న పెద్దల పేర్లు బయటపడతాయని స్థానికులు తెలిపారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

కొమ్మాల జాతరకు ఉత్సవ కమిటీ ఉన్నట్టా… లేనట్టా..?

కొమ్మాల జాతరకు ఉత్సవ కమిటీ ఉన్నట్టా… లేనట్టా..? చైర్మన్ లేకుండానే కొనసాగుతున్న బ్రహ్మోత్సవాలు జాతర...

కొమ్మాల జాతరను విజయవంతం చేద్దాం..

కొమ్మాల జాతరను విజయవంతం చేద్దాం.. *ముదిరాజ్ మహాసభ మండల అధ్యక్షుడు కొత్తగట్టు రాజేందర్...

కమలాపూర్‌లో ఘెర రోడ్డు ప్ర‌మాదం

కమలాపూర్‌లో ఘెర రోడ్డు ప్ర‌మాదం డివైడర్‌ను ఢీకొట్టి బైక్‌.. ఇద్ద‌రు దుర్మ‌ర‌ణం శనిగరం గ్రామంలో...

చెన్నారావుపేటలో బీఆర్ఎస్‌కు బిగ్ షాక్..!

చెన్నారావుపేటలో బీఆర్ఎస్‌కు బిగ్ షాక్..! మేజర్ గ్రామ సర్పంచ్ సహా నేతల కాంగ్రెస్‌లో...

ప్రభబండ్ల నిర్వాహకులకు మార్గదర్శకాలు

ప్రభబండ్ల నిర్వాహకులకు మార్గదర్శకాలు నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు డీసీపీ అంకిత్ హెచ్చరిక కాకతీయ,గీసుగొండ:...

ఎమ్మెల్యే ఆదేశాలు.. కాంట్రాక్టర్ బేఖతార్..!

ఎమ్మెల్యే ఆదేశాలు.. కాంట్రాక్టర్ బేఖతార్..! కొమ్మాల జాతరలో భద్రతపై నిర్లక్ష్యం? బావులకు కాంక్రీట్ గోడలు...

ప్ర‌భ‌ల బ‌లాబ‌లాలు..!

ప్ర‌భ‌ల బ‌లాబ‌లాలు..! కొమ్మాల జాతరకు సిద్ధమవుతున్న ప్రభల పందెం! ప్రదర్శనకు పార్టీల పోటాపోటీగా బండ్ల...

న్యూ కౌటిల్యాస్ సెయింట్ ఆమెన్ హైస్కూల్లో సైన్స్ డే

న్యూ కౌటిల్యాస్ సెయింట్ ఆమెన్ హైస్కూల్లో సైన్స్ డే కాకతీయ, వరంగల్ సిటీ...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!?

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!? సీజ్ చేసిన క‌ల‌ప‌ మాయం..?! ములుగు జిల్లా అట‌వీశాఖ‌లో క‌ల‌క‌లం వేరే...

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్ 116 మునిసిపాలిటీలు.. 7కార్పోరేష‌న్ల‌లో న‌మోదైన పోలింగ్ శాతం వివ‌రాలు ఒక్క...

ఔష‌ధం కాదు.. ! విషం..!!

ఔష‌ధం కాదు.. ! విషం..!! తెలంగాణలో తయారైన 35ర‌కాల మందులు ఫెయిల్‌ సీడీఎస్‌సీవో తనిఖీల్లో...

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..!

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..! చరిత్రకు జానపద స్వరం..అద్భుతం పాట రూపంలో సమ్మక్క–సారలమ్మ...

మేడారంలో హైటెక్ భద్రత

మేడారంలో హైటెక్ భద్రత మూడు కోట్ల మందికిపైగా భక్తుల రాక అంచనా కమాండ్ కంట్రోల్...

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...
spot_img

Popular Categories

spot_imgspot_img