epaper
Thursday, January 15, 2026
epaper

ఓటు @ రూ. 5వేలు !

ఓటు @ రూ. 5వేలు !

జోరుగా ప్ర‌ధాన పార్టీల పోల్ మేనేజ్‌మెంట్ !

చివ‌రి ద‌శ‌కు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్ర‌చారం

మరికొన్ని గంటల్లో ప్రచార పర్వానికి తెర

కాంగ్రెస్‌, బీఆర్ఎస్ మ‌ధ్య ట‌గ్ ఆఫ్ వార్ !

నియోజకవర్గంలో మొత్తం 3,92,669 ఓటర్లు

ఇందులో 24 శాతం మైనారిటీలే..

ముస్లిం మైనార్టీ ఓట్ల‌పైనే ప్ర‌ధాన పార్టీల గురి

నవంబర్ 11న పోలింగ్ .. 14న‌ రిజ‌ల్ట్స్‌

ఎన్నికల సంఘం పటిష్ట ఏర్పాట్లు

నియోజ‌క‌వ‌ర్గంలో మ‌ద్యం దుకాణాలు బంద్‌

ఉత్త‌ర్వులు జారీచేసిన సీసీ స‌జ్జ‌న్నార్‌

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారం చివరి దశకు చేరింది. మరికొన్ని గంటల్లో ప్రచార పర్వానికి తెరపడనుంది. ఎన్నికల కమిషన్ షెడ్యూల్ ప్రకారం… నవంబర్ 9 సాయంత్రంతో ప్రచారం ముగియనుంది. దీంతో మైకులు బంద్ కావటమే కాదు ..ఇతర ప్రాంతాల నేతలు కూడా నియోజకవర్గం వదిలి వెళ్లాల్సి ఉంటుంది. కాగా.. ప్రచార ప‌ర్వం ముగియ‌నుండ‌గా.. వెంట‌నే ప్ర‌లోభాల ప‌ర్వం మొద‌లుకానుంది. అధికార కాంగ్రెస్, ప్ర‌తిప‌క్ష బీఆర్ఎస్ పార్టీలు పోల్ మేనేజ్మేంట్‌పై ఫోకస్ పెట్టాయి. చివరి నిమిషం వరకు పట్టు విడవకుండా పనిచేయాలని పార్టీ అధినాయకత్వాలు ఇప్ప‌టికే కేడ‌ర్‌కు దిశానిర్దేశం చేశాయి. ఒక్కో ఓటును ఒడిసిప‌ట్టాల‌ని, డివిజన్లవారీగా పక్కాగా లెక్కలు వేసుకుంటూ ముందుకెళ్తున్నారు. ఈక్ర‌మంలోనే గెలిచి తీరాల‌న్న ప‌ట్టుద‌ల‌తో కాంగ్రెస్‌, బీఆర్ఎస్ పార్టీలు ఓటుకు రూ. 5వేల చొప్పున పంచేందుకు సిద్ధ‌మ‌వుతున్నాయ‌నే టాక్ వినిపిస్తోంది. ఇందుకోసం వంద మంది ఓట‌ర్ల‌కు ఓ లీడ‌ర్ చొప్పున బాధ్య‌త‌లు అప్ప‌గించిన‌ట్లు, ఇప్ప‌టికే నియోజ‌క‌వ‌ర్గంలో న‌గ‌దు డంప్ అయిన‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది. దాదాపు నాలుగు లక్షల మంది ఓటర్లు ఉన్న జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో 24 శాతం మైనారిటీలు ఉన్నారు. అభ్య‌ర్థి గెలుపు ఓట‌ముల్లో ముస్లిం ఓట్లు కీల‌కంకానుండ‌టంతో పార్టీల‌న్నీ
ఆ వ‌ర్గంపై దృష్టిపెట్టాయి.

మ‌ద్యం దుకాణాలు బంద్‌

జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కోసం నవంబర్ 11వ తేదీన పోలింగ్ జ‌ర‌గ‌నుంది. ఇందుకోసం ఎన్నికల సంఘం పటిష్టమైన ఏర్పాట్లు సిద్ధం చేసింది. ఇక నవంబర్ 14వ తేదీన ఓట్ల లెక్కింపు చేపట్టి… ఫలితాలను ప్రకటించ‌నున్నారు. జూబ్లీహిల్స్‌ ఉపఎన్నిక పోలింగ్‌ దృష్ట్యా హైదరాబాద్‌ కమిషనర్​ ఆఫ్ పోలీస్​ సజ్జనార్‌ కీలక ఆదేశాలను జారీ చేశారు. నియోజకవర్గం పరిధిలో 9వ తేదీ (ఆదివారం) సాయంత్రం 6 గంటల నుంచి ఉపఎన్నిక జరగనున్న 11వ తేదీ (మంగళవాం) సాయంత్రం 6 గంటల వరకు, తిరిగి ఓట్ల లెక్కింపు జరిగే 14వ తేదీన ఉదయం 6 గంటల నుంచి 15 సాయంత్రం 6 గంటల వరకు ఆంక్షలు అమల్లో ఉంటాయని వెల్లడించారు. నిర్దేశించిన సమయాల్లో మద్యం దుకాణాలన్నీ మూసి వేయాలని, హోటళ్లు, రెస్టారంట్‌లు, క్లబ్బులు మూసివేయాలని సజ్జనార్ ఆదేశించారు. శాంతిభద్రతల నేపథ్యంలో జూబ్లీహిల్స్​ నియోజకవర్గం వ్యాప్తంగా 144 సెక్షన్‌ అమల్లో ఉంటుందని వివరించారు. పోలింగ్‌ కేంద్రాలకు 200 మీటర్ల పరిధిలో ఐదుగురు, అంతకంటే ఎక్కువ మంది గుమిగూడటం నిషేధమని వివరించారు. ఓట్ల లెక్కింపు రోజున రహదారులు, జనావాసాల్లో బాణాసంచా పేల్చడం నిషేధమని, ఈ ఆదేశాలను ఉల్లంఘించిన వారిపై చట్ట ప్రకారం చర్యలు తప్పవని సీపీ సజ్జనార్​ హెచ్చరించారు.

నువ్వానేనా అన్న‌ట్లుగా ..

ఈ ఏడాది జూన్ 8న బీఆర్ఎస్‌ సిట్టింగ్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మరణంతో జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గంలో ఉప ఎన్నిక అనివార్యమైంది. ఈ నియోజకవర్గం పరిధిలో 3,92,669 ఓటర్లు ఉన్నారు. ఉప ఎన్నికకు గోపీనాథ్ భార్య మాగంటి సునీతను బీఆర్ఎస్ తన అభ్యర్థిగా ప్రకటించింది . కాంగ్రెస్ నుంచి నవీన్ యాదవ్‌కు ఎంఐఎం పార్టీ మ‌ద్ద‌తు ఇస్తోంది. బీజేపీ నుంచి దీపక్ రెడ్డి బరిలో ఉండ‌గా ఆయ‌న‌కు జ‌న‌సేన స‌పోర్ట్ చేస్తోంది. వీరితోపాటు మరికొంత మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ పార్టీల మధ్యనే ప్రధానంగా పోటీ నెలకొంది. ప్రతి ఇంటికి వెళ్తూ… ఓటర్లను ప్రసన్నం చేసుకుంటున్నారు. తమ అభ్యర్థికి ఓటు వేసి గెలిపించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. కాంగ్రెస్ నుంచి ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి .. బీఆర్ఎస్ నుంచి కేటీఆర్ అన్నీ తానై వ్యవహరిస్తున్నారు. ఇక బీజేపీ నుంచి కూడా కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ విస్తృత ప్రచారం చేప‌డుతున్నారు. అందరికంటే ముందే ప్రచారం ప్రారంభించిన బీఆర్ఎస్ రోడ్ షోలు, కార్నర్ మీటింగ్‌లు నిర్వహించింది. సీఎం రేవంత్ రెడ్డి కూడా రోడ్ షోలు చేపట్టి కాంగ్రెస్ శ్రేణుల్లో జోష్ పెంచారు. మరోవైపు బీజేపీ చీఫ్ రామచంద్రరావు దీపక్ రెడ్డికి మద్దతుగా డోర్ టు డోర్ కాంపెయిన్ చేశారు. కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ ప్రచారంలో పాల్గొని కేడ‌ర్‌లో ఉత్సాహం నింపారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

బీఆర్ఎస్‌కు ట‌ఫ్ టైం

బీఆర్ఎస్‌కు ట‌ఫ్ టైం ఖ‌మ్మంలో పార్టీని నిల‌బెట్టేది ఎవ‌రు..? మాజీమంత్రినా..? మాజీ ఎంపీనా..? కారు దిగిపోతున్న...

జర్నలిస్టులకు అండగా ప్రజా ప్రభుత్వం

జర్నలిస్టులకు అండగా ప్రజా ప్రభుత్వం అక్రిడిటేషన్లు తగ్గవు… మరింత పెరుగుతాయి జీవో–252లో మార్పులు, సూచనలకు...

ఇరాన్ ఆంక్షల దెబ్బ… బాస్మతి ఎగుమతులకు బ్రేక్

ఇరాన్ ఆంక్షల దెబ్బ… బాస్మతి ఎగుమతులకు బ్రేక్ అమెరికా ఆంక్షలతో ఇరాన్ ఆర్థిక...

జంక్ష‌న్లు జామ్‌

జంక్ష‌న్లు జామ్‌ విజయవాడ జాతీయ రహదారిపై వాహనాల రద్దీ 6 కిలోమీటర్ల మేర నిలిచిపోయిన...

మూసీ ప్రాజెక్టుతో రియ‌ల్ బూమ్‌

మూసీ ప్రాజెక్టుతో రియ‌ల్ బూమ్‌ ప్రాపర్టీ ధరలు హైక్ ! దాదాపు 15 నుండి...

క‌థ‌నం క‌ల‌క‌లం !

క‌థ‌నం క‌ల‌క‌లం ! ఐఏఎస్ అధికారికి, మంత్రికి మధ్య వివాహేతర బంధం ? అత్యంత...

విష‌మిచ్చి చంపండి

విష‌మిచ్చి చంపండి ఇప్ప‌టికే స‌గం చ‌నిపోయా మహిళా అధికారులను వివాదాల్లోకి లాగొద్దు రేటింగ్స్ కోసం మానసిక...

వివాదాలొద్దు

వివాదాలొద్దు ప‌క్క రాష్ట్రాల‌తో చ‌ర్చ‌ల‌కు సిద్ధం ప‌ర‌స్ప‌ర స‌హ‌కారంతో ముందుకుసాగుదాం ప్రపంచ నగరాలతో హైదరాబాద్ పోటీ 2034...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...

రేవంత్ కు కొత్త సవాల్!

* సర్కార్ కు పరీక్షగా సీఎస్ ఎంపిక? * ఈ నెలాఖరున రామకృష్ణారావు...

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం కాక‌తీయ‌, హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లాలోని బాటసింగారంలో...

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన ప్రతిపాదించిన ప్రాజెక్టుపై...

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా న్యూ డిల్లీ జూలై...

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు మొన్న యూనివర్సిటీల్లో ఆందోళనలు నిషేధిస్తూ మెమో నేడు...

రాష్ట్రంలో హద్దులు దాటిపోతున్న ఫోన్‌ ట్యాపింగ్‌

రాష్ట్రంలో హద్దులు దాటిపోతున్న ఫోన్‌ ట్యాపింగ్‌ కాంగ్రెస్‌ దూత ఫోన్‌ ట్యాపింగ్‌..! గాంధీ...
spot_img

Popular Categories

spot_imgspot_img