epaper
Monday, March 2, 2026
epaper

ఏం తమాషా చేస్తున్నారా?.

ఏం తమాషా చేస్తున్నారా?.
మైసమ్మ ఆలయాల కూల్చివేతపై బండి సంజయ్ ఆగ్రహం.
అధికారులకు 48 గంటల గడువు.

కాకతీయ, గోదావరిఖని : గోదావరిఖని,ఎన్‌టీపీసీ రోడ్డుపై ఉన్న 46 మైసమ్మ ఆలయాలను కూల్చివేయడంపై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. హిందూ దేవాలయాలను మాత్రమే లక్ష్యంగా చేసుకొని అధికారులు వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తూ, వెంటనే పునర్నిర్మాణం చేయకపోతే తీవ్ర పరిణామాలు తప్పవని హెచ్చరించారు.రోడ్డు విస్తరణ పేరుతో ఆలయాలను కూల్చివేస్తూ, అదే రోడ్డుకు అడ్డంగా ఉన్న మసీదులను వదిలేయడం వెనుక ఏ ఉద్దేశ్యమో అధికారులే చెప్పాలని ఆయన ప్రశ్నించారు. హైదరాబాదులోని తన నివాసం నుండి పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష, రామగుండం మున్సిపల్ కమిషనర్ అరుణశ్రీలకు ఫోన్ చేసి బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రోడ్డుకు అడ్డంగా మసీదులు కూడా ఉన్నాయి కదా? మరి అవి ఎందుకు కూల్చలేదు? హిందూ ఆలయాలంటే అంత చులకనా? అని ఆయన ప్రశ్నించారు. అధికారుల సమాధానాలు తృప్తికరంగా లేకపోవడంతో, ఏం తమాషా చేస్తున్నారా? ఎవరి మెప్పు కోసం ఇంత దుర్మార్గంగా ఆలయాలను కూల్చారు? అంటూ బండి సంజయ్ మండిపడ్డారు.మీకు 48 గంటల గడువు ఇస్తున్నా. కూల్చివేసిన మైసమ్మ ఆలయాలను ఆ సమయానికి పునర్నిర్మించండి.

లేకపోతే రోడ్డుకు అడ్డంగా ఉన్న మసీదులను కూడా కూల్చివేయాల్సిందే. జూబ్లిహిల్స్ ఉపఎన్నికల పోలింగ్ ముగిసిన వెంటనే నేనే గోదావరిఖని వస్తా. అక్కడి పరిస్థితులు నేను స్వయంగా చూస్తా. ఆలయాలను పునర్నిర్మించకపోతే మసీదులన్నింటినీ కూల్చివేయిస్తా అని ఆయన హెచ్చరించారు.ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో సహా సంబంధిత అధికారులందరినీ ప్రజల ముందుకు తీసుకువస్తానని, భవిష్యత్తులో ఏర్పడే పరిణామాలకు వారు పూర్తి బాధ్యత వహించాల్సి ఉంటుందని బండి సంజయ్ స్పష్టం చేశారు. ఆయన ప్రస్తుతం పార్టీ రాష్ట్ర నాయకులు, పెద్దపల్లి జిల్లా నేతలతో తదుపరి చర్యలపై చర్చలు జరుపుతున్నారు.స్థానికంగా ఆలయాల కూల్చివేతపై భక్తుల్లో తీవ్ర ఆగ్రహం నెలకొంది. ప్రతిరోజూ భక్తులు మొక్కుకునే దారి మైసమ్మ ఆలయాలను అర్ధరాత్రి వేళ కూల్చివేయడంతో ప్రాంతంలో ఉద్రిక్తత వాతావరణం ఏర్పడింది. పునర్నిర్మాణం జరిగే వరకు నిరసనలు కొనసాగిస్తామని భక్తులు స్పష్టం చేస్తున్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

వేములవాడ ఏఎస్పీకి ఆకస్మిక బదిలీ..!

వేములవాడ ఏఎస్పీకి ఆకస్మిక బదిలీ..! రెండు నెలల్లోనే రుత్విక్ సాయి ట్రాన్స్‌ఫర్ డీఎస్పీగా శ్రీనివాసులు...

సర్కారు భూముల కబ్జాలపై కఠిన చర్యలు

సర్కారు భూముల కబ్జాలపై కఠిన చర్యలు ఆక్రమణలు తొలగించి పేదలకు పంపిణీ ధర్మారంలో క్రీడా...

ఎమ్మెల్యే వ్యాఖ్యలపై రజక సంఘాల ఆగ్రహం

ఎమ్మెల్యే వ్యాఖ్యలపై రజక సంఘాల ఆగ్రహం కరీంనగర్‌లో వీర్లపల్లి శంకర్ దిష్టిబొమ్మ దహనం బాధిత...

లక్ష్మీనరసింహస్వామి కళ్యాణంలో కలెక్టర్ దంపతులు

లక్ష్మీనరసింహస్వామి కళ్యాణంలో కలెక్టర్ దంపతులు పట్టు వస్త్రాలు సమర్పణ కాక‌తీయ‌, జగిత్యాల : ధర్మపురి...

హుజూరాబాద్‌లో బీఆర్‌ఎస్ భూస్థాపితం ఖాయం

హుజూరాబాద్‌లో బీఆర్‌ఎస్ భూస్థాపితం ఖాయం కాంగ్రెస్ నియోజకవర్గ ఇంచార్జి ప్రణవ్ కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలు,...

బండి సంజయ్ ధర్మం తప్పుతున్నారు

బండి సంజయ్ ధర్మం తప్పుతున్నారు బీఆర్‌ఎస్ నగర అధ్యక్షుడు చల్ల హరిశంకర్ రెబల్స్ చేరిక,...

50వ డివిజన్‌ను ఆదర్శంగా తీర్చిదిద్దుతా

50వ డివిజన్‌ను ఆదర్శంగా తీర్చిదిద్దుతా కార్పొరేటర్ బోయినపల్లి ప్రవీణ్ రావు కాక‌తీయ‌, కరీంనగర్ :...

సైన్స్‌పై మ‌క్కువ పెంచుకోవాలి

సైన్స్‌పై మ‌క్కువ పెంచుకోవాలి ప్రశ్నించేత‌త్వం అల‌వ‌ర్చుకోవాలి రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ కాకతీయ, రుద్రంగి:...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!?

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!? సీజ్ చేసిన క‌ల‌ప‌ మాయం..?! ములుగు జిల్లా అట‌వీశాఖ‌లో క‌ల‌క‌లం వేరే...

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్ 116 మునిసిపాలిటీలు.. 7కార్పోరేష‌న్ల‌లో న‌మోదైన పోలింగ్ శాతం వివ‌రాలు ఒక్క...

ఔష‌ధం కాదు.. ! విషం..!!

ఔష‌ధం కాదు.. ! విషం..!! తెలంగాణలో తయారైన 35ర‌కాల మందులు ఫెయిల్‌ సీడీఎస్‌సీవో తనిఖీల్లో...

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..!

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..! చరిత్రకు జానపద స్వరం..అద్భుతం పాట రూపంలో సమ్మక్క–సారలమ్మ...

మేడారంలో హైటెక్ భద్రత

మేడారంలో హైటెక్ భద్రత మూడు కోట్ల మందికిపైగా భక్తుల రాక అంచనా కమాండ్ కంట్రోల్...

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...
spot_img

Popular Categories

spot_imgspot_img