epaper
Saturday, November 15, 2025
epaper

ప్రాణాలు తీస్తున్న పైపులు!

  • ప్రమాదకరంగా ఏనుమాముల మార్కెట్ వంద ఫీట్ల రోడ్డు
  • ప్రాణాంతకంగా డివైడర్ స్థానంలో వేసిన పెద్దపెద్ద పైపులు
  • ఏళ్లు గడుస్తున్నా పట్టించుకోని బల్దియా ఇంజినీరింగ్ అధికారులు
  • ప్రజలు మృతిచెందుతున్నా స్పందించని జీడబ్ల్యూఎంసీ పాలకులు
  • ఇంకెంతమంది చనిపోతే పట్టించుకుంటారని ఆగ్రహిస్తున్న ప్రజలు

కాకతీయ, వరంగల్ : కాలాతీత పనులతో ప్రజలు కాలం చేయాల్సిన పరిస్థితులు దాపురించాయి. వరంగల్ మహానగరంలో ఆరేండ్ల క్రితం చేపట్టిన పనులు అసంపూర్తిగా వదిలేయడం ప్రాణాలకు ముప్పు తెచ్చిపెడుతోంది. రోడ్డు మధ్యలో వదిలేసిన పెద్దపెద్ద సొరంగాల్లాంటి సిమెంట్ పైపులు జీవితాలను మింగుతున్నాయి. స్థానికంగా నివసించే వారిని, రహదారి వెంట ప్రయాణించే వారిని భయంగొల్పుతున్నాయి. సంవత్సరాలు గడుస్తున్నా.. అధికారులు గానీ, ప్రజాప్రతినిధులు గానీ ప్రమాదాలను గుర్తించకపోవడం ఆశ్చర్యానికి గురిచేస్తోంది. పాలకుల తీరుపై ప్రజల్లో ఆగ్రహానికి దారితీస్తున్నాయి.

బీఆర్ఎస్ హయాంలో మొదలై..!

ఆరేండ్ల క్రితం అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో వరంగల్ ఏరియా లేబర్ కాలనీ నుంచి ఏనుమాముల మార్కెట్ వెళ్లే మార్గంలో వంద ఫీట్ల రోడ్డు పనర్నిర్మాణం చేపట్టారు. గతంలో తారు రోడ్డు ఉండగా, దాని స్థానంలో సీసీ రోడ్డు వేశారు. ఇదే క్రమంలో డ్రెయినేజీ కోసమో, ఇంకే అవసరానికో పెద్దపెద్ద సిమెంట్ పైపులు వేయాలని నిర్ణయించారు. వాటిని తీసుకొచ్చి రోడ్డు మధ్యలో డివైడర్ నిర్మించే స్థలంలో వేశారు. ఒక్కో పైపు మనిషి ఎత్తులో ఉండగా, ఒకదానిపై ఒకటి అలా రెండు, మూడు అంతరాల్లో పెట్టారు. పనులు చేపట్టిన నాటి నుంచి ఏడాదిలోగా పనులు పూర్తి కావాల్సి ఉండగా, కాంట్రాక్టర్ నిర్లక్ష్యం మూలంగా నేటికి ఆ పనులు అసంపూర్తిగా మిగిలిపోయాయి. ఇదిలా ఉండగా పనుల్లో జాప్యం, లోపాల కారణంగా సదరు కాంట్రాక్టర్ ను వరంగల్ మహానగర పాలక సంస్థ రద్దు చేసి చేతులు దులుపుకుంది. మిగతా పనులు చేయించడంలో మీనమేషాలు లెక్కిస్తోంది. కనీసం అటువైపు కన్నెత్తి చూసే వారే కరువయ్యారు.

ప్రమాదకరంగా పైపులు..

ఇక ఈ మార్గంలో ఒకవైపు రోడ్డుపై వెళ్లే ప్రయాణికులకు మరో వైపు వెళ్లే ప్రయాణికులు, వాహనాలు కనపడని పరిస్థితి నెలకొంది. పైపులు వేసే క్రమంలో పలు కాలనీలకు వెళ్లేందుకు వీలుగా అక్కడక్కడా పైపుల మధ్య ఖాళీ స్థలం వదిలేశారు. ఇలా స్థానికులు రోడ్డుకు ఒక వైపు నుంచి మరో వైపు వెళ్లే క్రమంలో పైపులను దాటుతుండగా, అటువైపు వచ్చే వాహనాలు కనపడక ప్రమాదాలకు కారణమవుతున్నాయి. ఇలా ఇప్పటికే ఐదారుగురు ప్రాణాలు వదిలారు. ఇటీవల ఏనుమాముల మార్కెట్లో పనిచేసే సెక్యూరిటీ గార్డు ఒక్కరు రోడ్డు దాటుతుండగా.. పైపులైన్ ను ఆనుకుని నిలబడగా.. ఒక ద్విచక్రవాహనం వేగంగా వచ్చి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో సెక్యూరిటీ గార్డ్ మరణించాడు.

పట్టించుకోని ప్రజాప్రతినిధులు..

వరంగల్ నగరంలో ఒక మంత్రి, వర్ధన్నపేట ఎమ్మెల్యే, స్థానిక కార్పొరేటర్, ఒక మేయర్ ప్రాతినిధ్యం వహిస్తున్నా… ఈ అసంపూర్తి పనులను పట్టించుకున్న దాఖలాలు లేవు. జరుగుతున్న ప్రమాదాలను చూసైనా వారిలో చలనం కలగకపోవడం విస్మయానికి గురి చేస్తోంది. కోట్లకు కోట్లు కుమ్మరించి.. మంచిగా ఉన్న భద్రకాళి చెరువు మత్తడిని కూలగొట్టి కొత్తది నిర్మించేందుకు మొగ్గు చూపిన ప్రజాప్రతినిధులు.. ఇక్కడ అసంపూర్తి పనులతో, రోడ్డుకు అడ్డంగా వేసిన పైపులతో ప్రాణాలు పోతున్నా.. ప్రజా సంక్షేమం పట్ల వారికున్న నిబద్దతకు అద్దం పడుతోంది. స్థానికులు సైతం పలుమార్లు ప్రజాప్రతినిధులకు విన్నవించినా గ్రీవెన్స్ లో ఫిర్యాదు చేసినా వారికి చీమకుట్టినట్లు కూడా లేకపోవడం ఆశ్చర్యానికి గురిచేస్తోంది. దీంతో పాలకుల తీరుపై ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇంకెంతమంది చనిపోతే.. ఈ పైపులను తొలగిస్తారని మండిపడుతున్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

రామప్ప ఆల‌యానికి నెదర్లాండ్ దంపతులు

రామప్ప ఆల‌యానికి నెదర్లాండ్ దంపతులు కాకతీయ, ములుగు ప్రతినిధి: యునెస్కో వరల్డ్ హెరిటేజ్...

రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి

రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి కాకతీయ, దుగ్గొండి: రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి...

ఘనంగా స్వయం పరిపాలన దినోత్సవం

ఘనంగా స్వయం పరిపాలన దినోత్సవం కాకతీయ,నర్సింహులపేట: మండలంలోని ఎంపీయుపిఎస్ పడమటిగూడెం,మండల కేంద్రంలోని జిల్లాపరిషత్...

అయ్యప్ప స్వామి కుటీరం గృహప్రవేశం

అయ్యప్ప స్వామి కుటీరం గృహప్రవేశం కాకతీయ,నర్సింహులపేట: మండల కేంద్రంలోని శ్రీవెంకటేశ్వర స్వామి ఆలయం...

చెట్లను తొలగించిన వారిని అరెస్టు చేయాలి…

చెట్లను తొలగించిన వారిని అరెస్టు చేయాలి... కాకతీయ, రాయపర్తి /వర్ధన్నపేట : వర్ధన్నపేట...

డిజిటల్ బోధనతో అవగాహన పెంపొందుతుంది

డిజిటల్ బోధనతో అవగాహన పెంపొందుతుంది కాకతీయ, నెల్లికుదురు : డిజిటల్ బోధనతో విద్యార్థుల్లో...

మండలంలో ఘనంగా స్వపరిపాలన దినోత్సవం

మండలంలో ఘనంగా స్వపరిపాలన దినోత్సవం కాకతీయ, పెద్దవంగర : మండల కేంద్రంలోని పలు...

భద్రకాళి చేరువుపై రోప్ వే, గ్లాస్ బ్రిడ్జ్

భద్రకాళి చేరువుపై రోప్ వే, గ్లాస్ బ్రిడ్జ్ ప్రజెంటేషన్ లను సమీక్షించిన కూడా...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...

రేవంత్ కు కొత్త సవాల్!

* సర్కార్ కు పరీక్షగా సీఎస్ ఎంపిక? * ఈ నెలాఖరున రామకృష్ణారావు...

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం కాక‌తీయ‌, హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లాలోని బాటసింగారంలో...

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన ప్రతిపాదించిన ప్రాజెక్టుపై...

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా న్యూ డిల్లీ జూలై...

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు మొన్న యూనివర్సిటీల్లో ఆందోళనలు నిషేధిస్తూ మెమో నేడు...

రాష్ట్రంలో హద్దులు దాటిపోతున్న ఫోన్‌ ట్యాపింగ్‌

రాష్ట్రంలో హద్దులు దాటిపోతున్న ఫోన్‌ ట్యాపింగ్‌ కాంగ్రెస్‌ దూత ఫోన్‌ ట్యాపింగ్‌..! గాంధీ...
spot_img

Popular Categories

spot_imgspot_img