epaper
Thursday, January 15, 2026
epaper

92 ఇండిగో విమానాల రద్దు

92 ఇండిగో విమానాల రద్దు

శంషాబాద్‌ ఎయిర్​పోర్ట్​లో ప్రయాణికుల ఆందోళన

ముందుగా బుక్‌ చేసుకున్న సర్వీసుల‌ రద్దుతో తీవ్ర ఆగ్ర‌హం

దేశంలోనూ వందలాది విమానాలు రద్దు

న్యాయమైన పోటీ లేకపోవడం వల్లే స‌మ‌స్య‌

ప్ర‌మాదంలో వేలాది ప్రయాణికుల భద్రత

కేంద్రంపై ప్రతిపక్షనేత రాహుల్ గాంధీ ఫైర్‌

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో: ఇండిగో విమానాల రాకపోకలను నిలిపేయడంతో శంషాబాద్‌ విమానాశ్రయంలో ప్రయాణికులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. మొత్తం 92 ఇండిగో విమానాలు రద్దు చేసినట్లు ఆ సంస్థ వెల్లడించింది. ఇందులో శంషాబాద్‌కు రావాల్సినవి 43, ఇక్కడి నుంచి వెళ్లాల్సినవి 49 సర్వీసులు ఉన్నాయి. ముందుగా బుక్‌ చేసుకున్న సర్వీసులను రద్దు చేయడం పట్ల ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. చెక్‌ఇన్‌ అయిన తర్వాత విమానాల రద్దు సమాచారం ఇవ్వడంపై ఎయిర్​పోర్ట్​లో నిరసన తెలిపారు. మరోవైపు విశాఖపట్నం నుంచి వెళ్లే 8 ఇండిగో విమాన సర్వీసులు రద్దు చేశారు. వీటిలో హైదరాబాద్‌, బెంగళూరు, అహ్మదాబాద్‌, చెన్నైకు వెళ్లాల్సినవి కూడా ఉన్నాయి.

నాలుగు రోజులుగా తీవ్ర అవ‌స్థ‌లు

దేశంలోని అతి పెద్ద విమానయాన సంస్థ ఇండిగో సేవల్లో కొన్నిరోజులుగా తీవ్రమైన అంతరాయం ఏర్పడుతోంది. నాలుగు రోజులుగా కొనసాగుతున్న ఈ సంక్షోభం వల్ల దేశవ్యాప్తంగా వందలాది విమానాలు రద్దు అవ్వడంతో ప్రయాణికులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. కొన్ని ఎయిర్​పోర్టుల్లో పరిస్థితి నియంత్రణలో లేకపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దిల్లీ విమానాశ్రయంలో వేల సంఖ్యలో బ్యాగులు టెర్మినల్‌లో పేరుకుపోయాయి. 12 నుంచి 14 గంటల పాటు ప్రయాణికులు నీరు, భోజనం లేకుండా తీవ్ర అసహనానికి గురయ్యారు. ఈ సమస్యకు ఫ్లైట్‌ డ్యూటీ టైమ్‌ లిమిటేషన్స్‌ నూతన దశ అమలులో వచ్చిన మార్పులు, క్రూ ప్లానింగ్‌లో పలు లోపాలు, శీతాకాలం కారణంగా ఆపరేషనల్‌ పరిమితులు, సిబ్బంది కొరత వంటి అంశాలు డీజీసీఏ సమీక్షలో ప్రధాన కారణాలుగా తేలాయి. ఈ నేపథ్యంలో ఇండిగో ఫ్లైట్‌ డ్యూటీ టైమ్‌ లిమిటేషన్స్‌ నిబంధనల నుంచి ఎయిర్‌బస్‌ ఏ320 విమానాలకు మినహాయింపు కల్పించాలని డీజీసీఏను కోరింది. దీని పట్ల డీజీసీఏ ఇంకా ఎటువంటి నిర్ణయం ప్రకటించలేదు.

ఇది నియంతృత్వపు మోడల్ ఫలితం

ప్రతిపక్షనేత రాహుల్ గాంధీ విమానాల రద్దు అంశంపై తీవ్రంగా స్పందించారు. ఇది ప్రభుత్వపు నియంతృత్వపు మోడల్ ఫలితమని వ్యాఖ్యానించారు. న్యాయమైన పోటీ లేకపోవడం వల్లే ఇటువంటి గందరగోళం ఏర్పడిందని ఆయన విమర్శించారు. రాజ్యసభలో శివసేన (ఉద్ధవ్ ఠాక్రే వర్గం) ఎంపీ ప్రియాంకా చతుర్వేది నిబంధన 180 కింద నోటీసు ఇవ్వడంతో పాటు పౌర విమానయాన మంత్రిత్వశాఖ వెంటనే స్పందించాలని డిమాండ్ చేశారు. వేలాది మంది ప్రయాణికుల భద్రత, సౌకర్యం ప్రమాదంలో పడటం అత్యంత ముఖ్యమైన అంశమని ఆయ‌న పేర్కొన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

బీఆర్ఎస్‌కు ట‌ఫ్ టైం

బీఆర్ఎస్‌కు ట‌ఫ్ టైం ఖ‌మ్మంలో పార్టీని నిల‌బెట్టేది ఎవ‌రు..? మాజీమంత్రినా..? మాజీ ఎంపీనా..? కారు దిగిపోతున్న...

జర్నలిస్టులకు అండగా ప్రజా ప్రభుత్వం

జర్నలిస్టులకు అండగా ప్రజా ప్రభుత్వం అక్రిడిటేషన్లు తగ్గవు… మరింత పెరుగుతాయి జీవో–252లో మార్పులు, సూచనలకు...

ఇరాన్ ఆంక్షల దెబ్బ… బాస్మతి ఎగుమతులకు బ్రేక్

ఇరాన్ ఆంక్షల దెబ్బ… బాస్మతి ఎగుమతులకు బ్రేక్ అమెరికా ఆంక్షలతో ఇరాన్ ఆర్థిక...

జంక్ష‌న్లు జామ్‌

జంక్ష‌న్లు జామ్‌ విజయవాడ జాతీయ రహదారిపై వాహనాల రద్దీ 6 కిలోమీటర్ల మేర నిలిచిపోయిన...

మూసీ ప్రాజెక్టుతో రియ‌ల్ బూమ్‌

మూసీ ప్రాజెక్టుతో రియ‌ల్ బూమ్‌ ప్రాపర్టీ ధరలు హైక్ ! దాదాపు 15 నుండి...

క‌థ‌నం క‌ల‌క‌లం !

క‌థ‌నం క‌ల‌క‌లం ! ఐఏఎస్ అధికారికి, మంత్రికి మధ్య వివాహేతర బంధం ? అత్యంత...

విష‌మిచ్చి చంపండి

విష‌మిచ్చి చంపండి ఇప్ప‌టికే స‌గం చ‌నిపోయా మహిళా అధికారులను వివాదాల్లోకి లాగొద్దు రేటింగ్స్ కోసం మానసిక...

వివాదాలొద్దు

వివాదాలొద్దు ప‌క్క రాష్ట్రాల‌తో చ‌ర్చ‌ల‌కు సిద్ధం ప‌ర‌స్ప‌ర స‌హ‌కారంతో ముందుకుసాగుదాం ప్రపంచ నగరాలతో హైదరాబాద్ పోటీ 2034...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...

రేవంత్ కు కొత్త సవాల్!

* సర్కార్ కు పరీక్షగా సీఎస్ ఎంపిక? * ఈ నెలాఖరున రామకృష్ణారావు...

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం కాక‌తీయ‌, హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లాలోని బాటసింగారంలో...

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన ప్రతిపాదించిన ప్రాజెక్టుపై...

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా న్యూ డిల్లీ జూలై...

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు మొన్న యూనివర్సిటీల్లో ఆందోళనలు నిషేధిస్తూ మెమో నేడు...

రాష్ట్రంలో హద్దులు దాటిపోతున్న ఫోన్‌ ట్యాపింగ్‌

రాష్ట్రంలో హద్దులు దాటిపోతున్న ఫోన్‌ ట్యాపింగ్‌ కాంగ్రెస్‌ దూత ఫోన్‌ ట్యాపింగ్‌..! గాంధీ...
spot_img

Popular Categories

spot_imgspot_img