epaper
Monday, March 2, 2026
epaper

92 ఇండిగో విమానాల రద్దు

92 ఇండిగో విమానాల రద్దు

శంషాబాద్‌ ఎయిర్​పోర్ట్​లో ప్రయాణికుల ఆందోళన

ముందుగా బుక్‌ చేసుకున్న సర్వీసుల‌ రద్దుతో తీవ్ర ఆగ్ర‌హం

దేశంలోనూ వందలాది విమానాలు రద్దు

న్యాయమైన పోటీ లేకపోవడం వల్లే స‌మ‌స్య‌

ప్ర‌మాదంలో వేలాది ప్రయాణికుల భద్రత

కేంద్రంపై ప్రతిపక్షనేత రాహుల్ గాంధీ ఫైర్‌

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో: ఇండిగో విమానాల రాకపోకలను నిలిపేయడంతో శంషాబాద్‌ విమానాశ్రయంలో ప్రయాణికులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. మొత్తం 92 ఇండిగో విమానాలు రద్దు చేసినట్లు ఆ సంస్థ వెల్లడించింది. ఇందులో శంషాబాద్‌కు రావాల్సినవి 43, ఇక్కడి నుంచి వెళ్లాల్సినవి 49 సర్వీసులు ఉన్నాయి. ముందుగా బుక్‌ చేసుకున్న సర్వీసులను రద్దు చేయడం పట్ల ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. చెక్‌ఇన్‌ అయిన తర్వాత విమానాల రద్దు సమాచారం ఇవ్వడంపై ఎయిర్​పోర్ట్​లో నిరసన తెలిపారు. మరోవైపు విశాఖపట్నం నుంచి వెళ్లే 8 ఇండిగో విమాన సర్వీసులు రద్దు చేశారు. వీటిలో హైదరాబాద్‌, బెంగళూరు, అహ్మదాబాద్‌, చెన్నైకు వెళ్లాల్సినవి కూడా ఉన్నాయి.

నాలుగు రోజులుగా తీవ్ర అవ‌స్థ‌లు

దేశంలోని అతి పెద్ద విమానయాన సంస్థ ఇండిగో సేవల్లో కొన్నిరోజులుగా తీవ్రమైన అంతరాయం ఏర్పడుతోంది. నాలుగు రోజులుగా కొనసాగుతున్న ఈ సంక్షోభం వల్ల దేశవ్యాప్తంగా వందలాది విమానాలు రద్దు అవ్వడంతో ప్రయాణికులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. కొన్ని ఎయిర్​పోర్టుల్లో పరిస్థితి నియంత్రణలో లేకపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దిల్లీ విమానాశ్రయంలో వేల సంఖ్యలో బ్యాగులు టెర్మినల్‌లో పేరుకుపోయాయి. 12 నుంచి 14 గంటల పాటు ప్రయాణికులు నీరు, భోజనం లేకుండా తీవ్ర అసహనానికి గురయ్యారు. ఈ సమస్యకు ఫ్లైట్‌ డ్యూటీ టైమ్‌ లిమిటేషన్స్‌ నూతన దశ అమలులో వచ్చిన మార్పులు, క్రూ ప్లానింగ్‌లో పలు లోపాలు, శీతాకాలం కారణంగా ఆపరేషనల్‌ పరిమితులు, సిబ్బంది కొరత వంటి అంశాలు డీజీసీఏ సమీక్షలో ప్రధాన కారణాలుగా తేలాయి. ఈ నేపథ్యంలో ఇండిగో ఫ్లైట్‌ డ్యూటీ టైమ్‌ లిమిటేషన్స్‌ నిబంధనల నుంచి ఎయిర్‌బస్‌ ఏ320 విమానాలకు మినహాయింపు కల్పించాలని డీజీసీఏను కోరింది. దీని పట్ల డీజీసీఏ ఇంకా ఎటువంటి నిర్ణయం ప్రకటించలేదు.

ఇది నియంతృత్వపు మోడల్ ఫలితం

ప్రతిపక్షనేత రాహుల్ గాంధీ విమానాల రద్దు అంశంపై తీవ్రంగా స్పందించారు. ఇది ప్రభుత్వపు నియంతృత్వపు మోడల్ ఫలితమని వ్యాఖ్యానించారు. న్యాయమైన పోటీ లేకపోవడం వల్లే ఇటువంటి గందరగోళం ఏర్పడిందని ఆయన విమర్శించారు. రాజ్యసభలో శివసేన (ఉద్ధవ్ ఠాక్రే వర్గం) ఎంపీ ప్రియాంకా చతుర్వేది నిబంధన 180 కింద నోటీసు ఇవ్వడంతో పాటు పౌర విమానయాన మంత్రిత్వశాఖ వెంటనే స్పందించాలని డిమాండ్ చేశారు. వేలాది మంది ప్రయాణికుల భద్రత, సౌకర్యం ప్రమాదంలో పడటం అత్యంత ముఖ్యమైన అంశమని ఆయ‌న పేర్కొన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

ఉద్యోగం ఉన్న‌ట్టా..?లేన‌ట్టా..?

ఉద్యోగం ఉన్న‌ట్టా..?లేన‌ట్టా..? ప‌నిచేస్తున్న‌ట్టా..? చేయ‌డం లేద‌న్న‌ట్టా..?! త్రిశంకు స్వ‌ర్గంలో భూ భార‌తి స‌ర్వేయ‌ర్లు వ‌ర్క ఆర్డ‌ర్...

భూ భారతి కాదు…భూ దోపిడీ!

భూ భారతి కాదు…భూ దోపిడీ! కాంగ్రెస్ నేతలు, అధికారుల జేబులు నింపడానికే కొత్త...

నియో పోలీస్‌కు నీటి భరోసా!

నియో పోలీస్‌కు నీటి భరోసా! జలమండలికి 3.95 ఎకరాల భూమి కేటాయింపు గ్రావిటీ విధానంలో...

కానిస్టేబుల్ సౌమ్య కుటుంబానికి ఎక్సైజ్ విశ్రాంత ఉద్యోగుల ఆసరా

కానిస్టేబుల్ సౌమ్య కుటుంబానికి ఎక్సైజ్ విశ్రాంత ఉద్యోగుల ఆసరా ఒక రోజు పెన్షన్‌తో...

పేదల ఇండ్లు కూల్చడం అమానుషం

పేదల ఇండ్లు కూల్చడం అమానుషం కాంగ్రెస్ పాలనలో క‌క్షపూరిత విధానాలు కొనసాగుతున్నాయి మాజీ మంత్రి...

జీపీలకు రూ.389 కోట్లు.. ఉద్యోగులకు రూ.745 కోట్లు విడుదల

జీపీలకు రూ.389 కోట్లు.. ఉద్యోగులకు రూ.745 కోట్లు విడుదల పెండింగ్ బిల్లుల చెల్లింపుకు...

విద్యా కమిషన్‌లో విద్యావేత్తలే లేరా?

విద్యా కమిషన్‌లో విద్యావేత్తలే లేరా? పీహెచ్‌డీలు లేకుండా విద్యా విధానం ఎలా? అర్హతలేని కమిటీతో...

“విద్యార్థుల నుంచి అధికారుల వరకూ… ఇది మీ త్యాగాల ఫలితం”

“విద్యార్థుల నుంచి అధికారుల వరకూ… ఇది మీ త్యాగాల ఫలితం” ప్రజలు ఆకలిని...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!?

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!? సీజ్ చేసిన క‌ల‌ప‌ మాయం..?! ములుగు జిల్లా అట‌వీశాఖ‌లో క‌ల‌క‌లం వేరే...

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్ 116 మునిసిపాలిటీలు.. 7కార్పోరేష‌న్ల‌లో న‌మోదైన పోలింగ్ శాతం వివ‌రాలు ఒక్క...

ఔష‌ధం కాదు.. ! విషం..!!

ఔష‌ధం కాదు.. ! విషం..!! తెలంగాణలో తయారైన 35ర‌కాల మందులు ఫెయిల్‌ సీడీఎస్‌సీవో తనిఖీల్లో...

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..!

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..! చరిత్రకు జానపద స్వరం..అద్భుతం పాట రూపంలో సమ్మక్క–సారలమ్మ...

మేడారంలో హైటెక్ భద్రత

మేడారంలో హైటెక్ భద్రత మూడు కోట్ల మందికిపైగా భక్తుల రాక అంచనా కమాండ్ కంట్రోల్...

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...
spot_img

Popular Categories

spot_imgspot_img