epaper
Monday, March 2, 2026
epaper

పెండింగ్‌లో ఉన్న 5 డీఏలు విడుద‌ల చేయాలి

  • రూ. 5500 కోట్ల కాంట్రిబ్యూష‌న్ పెన్షన్ డబ్బుల‌ను మళ్ళించిండ్రు..
  • బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : కాంగ్రెస్ ప్రభుత్వం తక్షణమే ఉద్యోగులకు పెండింగ్‌లో ఉన్న ఐదు డీఏలను విడుదల చేయాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు డిమాండ్ చేశారు. దసరా పండుగకు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు కేంద్రం 3 శాతం డీఏ మంజూరు చేస్తూ తీపి కబురు చెప్పింద‌ని, కానీ రేవంత్ రెడ్డి మాత్రం తెలంగాణ ఉద్యోగులకు చేదు ఫలితాలను అందిస్తున్నారని మండిపడ్డారు. ఎన్నికల ముందు పెండింగ్ డీఏ తక్షణమే చెల్లిస్తామని చెప్పి ఇప్పుడు 5 డీఏలు బకాయి పెట్టారంటూ విమర్శించారు. ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు అంటే కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎందుకు ఇంత చిన్న చూపు అని ప్రశ్నించారు.

73 శాతం గరిష్ట పీఆర్సీ అందించాం..

ఇవ్వాళ సిద్దిపేటలో మీడియాతో హరీష్ రావు మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ అభ‌య‌హ‌స్తం కాదని.. భస్మాసుర హస్తమని ఎద్దేవా చేశారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా 73శాతం గరిష్ట పీఆర్సీ అందించిన ఘనత కేసీఆర్ ప్రభుత్వాన్నిదని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం పోలీస్ సిబ్బందికి 14 డీఏలు ఐదు సిలిండర్లు పెండింగ్ పెట్టడం సిగ్గుచేటని మండిప‌డ్డారు. 5500 కోట్ల కాంట్రిబ్యూష‌న్ పెన్షన్ డబ్బులును రాష్ట్ర ప్రభుత్వం మళ్ళించిందని హ‌రీష్‌రావు ఆరోపించారు.

పీఆర్సీ త‌క్ష‌ణ‌మే ప్ర‌క‌టించాలి

ఇచ్చిన హామీలు అమలు చేయమని అడిగిన ఉద్యోగ సంఘాల నాయకులపై అక్రమ కేసులు పెడతామని బెదిరించడం దుర్మార్గమని హరీష్ రావు మండిపడ్డారు. ఉద్యోగుల ఆత్మగౌరవాన్ని రేవంత్ రెడ్డి ప్రభుత్వం దెబ్బతీసిందని విమర్శించారు. తక్షణమే రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు పెండింగ్లో ఉన్న ఐదు డీఏలను విడుదల చేయాలని, ఉద్యోగుల పీఆర్సీ ప్రకటించాలని కోరారు. రిటైర్డ్ ఉద్యోగుల బెనిఫిట్స్ తక్షణమే విడుదల చేయాలని, ఉద్యోగులు అలవెన్స్లు ఏరియల్స్ పెండింగ్లో ఉన్న వాటిని విడుదల చేయాలని డిమాండ్ చేశారు.

అన్నీ బందే..

రాష్ట్రంలో ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులకు మూడు నెలలు, నాలుగు నెలలు, ఆరు నెలల జీతం పెండింగ్లో ఉంద‌ని హ‌రీష్‌రావు ఆరోపించారు. ప్రభుత్వ ఎస్సీ, ఎస్టీ, బీసీ హాస్టల్లో కాస్మోటిక్ లకు, వాచ్‌మెన్ల‌కు నెలల తరబడి జీతం చెల్లించడం లేద‌న్నారు. ఫారెస్ట్ డిపార్ట్‌మెంట్లో పనిచేసే వాచ్ గాడ్లకు 12 నెలల నుంచి జీతాలు రావడం లేద‌ని, ఆశా వర్కర్లను రోడ్డెక్కించార‌ని మండిప‌డ్డారు. రేషన్ డీలర్లు కూడా మూడో తారీకు నుండి రేషన్ షాపులు బంద్ చేస్తామంటున్నార‌న్నారు. రాష్ట్రంలో హాస్పటళ్లు బందు, కాలేజీలు బందు, రేషన్ షాపులు బందు అన్నారు. ఆరోగ్యశ్రీ డబ్బులు సంవత్సరం నుండి చెల్లించడం లేదని ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేస్తామని ప్రైవేట్ ఆసుపత్రులు చెప్తున్నాయ‌ని హ‌రీష్‌రావు అన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

ఉద్యోగం ఉన్న‌ట్టా..?లేన‌ట్టా..?

ఉద్యోగం ఉన్న‌ట్టా..?లేన‌ట్టా..? ప‌నిచేస్తున్న‌ట్టా..? చేయ‌డం లేద‌న్న‌ట్టా..?! త్రిశంకు స్వ‌ర్గంలో భూ భార‌తి స‌ర్వేయ‌ర్లు వ‌ర్క ఆర్డ‌ర్...

భూ భారతి కాదు…భూ దోపిడీ!

భూ భారతి కాదు…భూ దోపిడీ! కాంగ్రెస్ నేతలు, అధికారుల జేబులు నింపడానికే కొత్త...

నియో పోలీస్‌కు నీటి భరోసా!

నియో పోలీస్‌కు నీటి భరోసా! జలమండలికి 3.95 ఎకరాల భూమి కేటాయింపు గ్రావిటీ విధానంలో...

కానిస్టేబుల్ సౌమ్య కుటుంబానికి ఎక్సైజ్ విశ్రాంత ఉద్యోగుల ఆసరా

కానిస్టేబుల్ సౌమ్య కుటుంబానికి ఎక్సైజ్ విశ్రాంత ఉద్యోగుల ఆసరా ఒక రోజు పెన్షన్‌తో...

పేదల ఇండ్లు కూల్చడం అమానుషం

పేదల ఇండ్లు కూల్చడం అమానుషం కాంగ్రెస్ పాలనలో క‌క్షపూరిత విధానాలు కొనసాగుతున్నాయి మాజీ మంత్రి...

జీపీలకు రూ.389 కోట్లు.. ఉద్యోగులకు రూ.745 కోట్లు విడుదల

జీపీలకు రూ.389 కోట్లు.. ఉద్యోగులకు రూ.745 కోట్లు విడుదల పెండింగ్ బిల్లుల చెల్లింపుకు...

విద్యా కమిషన్‌లో విద్యావేత్తలే లేరా?

విద్యా కమిషన్‌లో విద్యావేత్తలే లేరా? పీహెచ్‌డీలు లేకుండా విద్యా విధానం ఎలా? అర్హతలేని కమిటీతో...

“విద్యార్థుల నుంచి అధికారుల వరకూ… ఇది మీ త్యాగాల ఫలితం”

“విద్యార్థుల నుంచి అధికారుల వరకూ… ఇది మీ త్యాగాల ఫలితం” ప్రజలు ఆకలిని...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!?

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!? సీజ్ చేసిన క‌ల‌ప‌ మాయం..?! ములుగు జిల్లా అట‌వీశాఖ‌లో క‌ల‌క‌లం వేరే...

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్ 116 మునిసిపాలిటీలు.. 7కార్పోరేష‌న్ల‌లో న‌మోదైన పోలింగ్ శాతం వివ‌రాలు ఒక్క...

ఔష‌ధం కాదు.. ! విషం..!!

ఔష‌ధం కాదు.. ! విషం..!! తెలంగాణలో తయారైన 35ర‌కాల మందులు ఫెయిల్‌ సీడీఎస్‌సీవో తనిఖీల్లో...

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..!

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..! చరిత్రకు జానపద స్వరం..అద్భుతం పాట రూపంలో సమ్మక్క–సారలమ్మ...

మేడారంలో హైటెక్ భద్రత

మేడారంలో హైటెక్ భద్రత మూడు కోట్ల మందికిపైగా భక్తుల రాక అంచనా కమాండ్ కంట్రోల్...

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...
spot_img

Popular Categories

spot_imgspot_img