epaper
Tuesday, March 3, 2026
epaper

హైడ్రా ప్రజావాణికి 42 ఫిర్యాదులు

హైడ్రా ప్రజావాణికి 42 ఫిర్యాదులు
చెరువుల ఎఫ్‌టీఎల్ పరిధిలోనే ఆక్రమణలు
కోర్టు కేసులున్నా నిర్మాణాలు
ప్రగతినగర్ స్మశానవాటికను కాపాడాలంటూ విన్నపాలు

కాక‌తీయ‌,తెలంగాణ బ్యూరో : మేడ్చల్–మల్కాజిగిరి జిల్లాలో ప్రజావసరాలకు కేటాయించిన భూములు ఆక్రమణలకు గురవుతున్నాయంటూ స్థానికులు హైడ్రా ప్రజావాణిలో ఫిర్యాదులు సమర్పించారు. మొత్తం 42 ఫిర్యాదులు అందగా, పలు ప్రాంతాల్లో ప్రభుత్వ భూములు, చెరువుల ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్ పరిధుల్లో అక్రమ నిర్మాణాలు జరుగుతున్నాయనే ఆరోపణలు ప్రధానంగా వినిపించాయి. మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా ప్రగతినగర్‌లో ప్రజావసరాల కోసం కేటాయించిన సుమారు 5 ఎకరాల శ్మ‌శానవాటిక స్థలం కబ్జాకు గురవుతోందని స్థానిక నివాసితులు ఆరోపించారు. ఆలేటి శ్రీనివాసరావు, జశ్వంత్ తదితరులు ప్రజావాణిలో ఫిర్యాదు చేస్తూ, శ్మ‌శానవాటికకు ఆనుకుని ఉన్న దాదాపు 4 ఎకరాల చెత్త డంపింగ్ యార్డు ప్రభుత్వ భూమి కూడా ఆక్రమణలోకి వెళ్లిందని పేర్కొన్నారు. సర్వే అధికారులు దీనిని నిర్ధారించారని, హైడ్రా వెంటనే చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

బాచుపల్లి పెద్దకుంట… ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్‌లో నిర్మాణాలు

బాచుపల్లి పెద్దకుంట చెరువు ఎఫ్‌టీఎల్ మరియు బఫర్ జోన్ పరిధిలో శ్మ‌శాన వాటిక నిర్మాణం కొనసాగుతోందని శిఖర రెసిడెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఫిర్యాదు చేసింది. కోర్టులో కేసు పెండింగ్‌లో ఉన్నప్పటికీ నిర్మాణాలు ఆగడం లేదని ఆరోపించింది. శేరిలింగంపల్లి మండలం మదీనాగూడలోని పోచమ్మ దేవాలయానికి చెందిన భూమిలో అపార్ట్‌మెంట్ నిర్మాణం చేపట్టారని స్థానికులు ఫిర్యాదు చేశారు. గ్రామస్తులు అడ్డుకోవడంతో పనులు తాత్కాలికంగా ఆగాయని, అయితే విషయం కోర్టులో ఉన్నప్పటికీ అక్రమ నిర్మాణ యత్నాలు కొనసాగుతున్నాయని పేర్కొన్నారు.

అమీన్‌పూర్‌లో పోచమ్మకుంటలో కూడా ఇదే పరిస్థితి

అమీన్‌పూర్ సర్వే నంబర్ 971లోని పోచమ్మకుంట చెరువు ఎఫ్‌టీఎల్ పరిధిలో స్మశానవాటిక నిర్మాణం జరుగుతోందని మరో ఫిర్యాదు అందింది. చెరువుల పరిరక్షణకు హైడ్రా కఠిన చర్యలు తీసుకోవాలని నివాసితులు కోరుతున్నారు. మేడ్చల్ జిల్లా మేడిపల్లి మండలం బోడుప్పల్ ఎస్‌బీఆర్ కాలనీలో 25 అడుగుల రహదారిని సుమారు 5 అడుగుల మేర ఆక్రమించి షాపులు నిర్మించారని కాలనీ సంక్షేమ సంఘం ప్రతినిధులు ఫిర్యాదు చేశారు. దీంతో అంబులెన్స్‌లు, పాఠశాల బస్సులు వెళ్లలేని పరిస్థితి ఏర్పడిందని పేర్కొన్నారు. ఆక్రమణలో నిర్మించిన షట్టర్లు తొలగించాలని డిమాండ్ చేశారు.

హైడ్రా స్పందన

హైడ్రా అదనపు సంచాలకులు శ్రీ వర్ల పాపయ్య ఫిర్యాదులను పరిశీలించి, సమస్యల పరిష్కార బాధ్యతలను సంబంధిత అధికారులకు అప్పగించారు. ప్రజావసరాల భూములు, చెరువుల ఎఫ్‌టీఎల్ పరిధి, రహదారుల పరిరక్షణపై త్వరితగతిన చర్యలు తీసుకోవాలని స్థానికులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ప్రజావాణిలో వచ్చిన ఈ 42 ఫిర్యాదులు నగర పరిసర ప్రాంతాల్లో భూఆక్రమణలు ఎంత తీవ్రమైన స్థాయిలో ఉన్నాయో స్పష్టంచేస్తున్నాయి.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

తమ్మినేనిపై అభిశంసన… వామపక్షంలో ప్రకంపనలు

తమ్మినేనిపై అభిశంసన… వామపక్షంలో ప్రకంపనలు కేంద్ర కమిటీ ఘాటు హెచ్చరిక ఆర్థిక వ్యవహారాలపై అభ్యంతరాలు కుటుంబ...

రాహుల్ గాంధీతో ఇనుగాల దంప‌తుల భేటీ

రాహుల్ గాంధీతో ఇనుగాల దంప‌తుల భేటీ గాంధీ కుటుంబానికి సంబంధించిన పెయిటింగ్‌ను జ్ఞాపిక‌గా...

ఉద్యోగం ఉన్న‌ట్టా..?లేన‌ట్టా..?

ఉద్యోగం ఉన్న‌ట్టా..?లేన‌ట్టా..? ప‌నిచేస్తున్న‌ట్టా..? చేయ‌డం లేద‌న్న‌ట్టా..?! త్రిశంకు స్వ‌ర్గంలో భూ భార‌తి స‌ర్వేయ‌ర్లు వ‌ర్క ఆర్డ‌ర్...

భూ భారతి కాదు…భూ దోపిడీ!

భూ భారతి కాదు…భూ దోపిడీ! కాంగ్రెస్ నేతలు, అధికారుల జేబులు నింపడానికే కొత్త...

నియో పోలీస్‌కు నీటి భరోసా!

నియో పోలీస్‌కు నీటి భరోసా! జలమండలికి 3.95 ఎకరాల భూమి కేటాయింపు గ్రావిటీ విధానంలో...

కానిస్టేబుల్ సౌమ్య కుటుంబానికి ఎక్సైజ్ విశ్రాంత ఉద్యోగుల ఆసరా

కానిస్టేబుల్ సౌమ్య కుటుంబానికి ఎక్సైజ్ విశ్రాంత ఉద్యోగుల ఆసరా ఒక రోజు పెన్షన్‌తో...

పేదల ఇండ్లు కూల్చడం అమానుషం

పేదల ఇండ్లు కూల్చడం అమానుషం కాంగ్రెస్ పాలనలో క‌క్షపూరిత విధానాలు కొనసాగుతున్నాయి మాజీ మంత్రి...

జీపీలకు రూ.389 కోట్లు.. ఉద్యోగులకు రూ.745 కోట్లు విడుదల

జీపీలకు రూ.389 కోట్లు.. ఉద్యోగులకు రూ.745 కోట్లు విడుదల పెండింగ్ బిల్లుల చెల్లింపుకు...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!?

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!? సీజ్ చేసిన క‌ల‌ప‌ మాయం..?! ములుగు జిల్లా అట‌వీశాఖ‌లో క‌ల‌క‌లం వేరే...

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్ 116 మునిసిపాలిటీలు.. 7కార్పోరేష‌న్ల‌లో న‌మోదైన పోలింగ్ శాతం వివ‌రాలు ఒక్క...

ఔష‌ధం కాదు.. ! విషం..!!

ఔష‌ధం కాదు.. ! విషం..!! తెలంగాణలో తయారైన 35ర‌కాల మందులు ఫెయిల్‌ సీడీఎస్‌సీవో తనిఖీల్లో...

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..!

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..! చరిత్రకు జానపద స్వరం..అద్భుతం పాట రూపంలో సమ్మక్క–సారలమ్మ...

మేడారంలో హైటెక్ భద్రత

మేడారంలో హైటెక్ భద్రత మూడు కోట్ల మందికిపైగా భక్తుల రాక అంచనా కమాండ్ కంట్రోల్...

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...
spot_img

Popular Categories

spot_imgspot_img