epaper
Saturday, November 15, 2025
epaper

జూబ్లీహిల్స్‌లో 20 వేల దొంగ ఓట్లు..

  • ఒక్కో ఇంట్లో 150 నుంచి 200 వ‌ర‌కు నమోదు
  • ఎట్లైన గెల‌వాల‌ని కాంగ్రెస్ అడ్డ‌దారులు
  • సామ, ధాన, భేద దండోపాయాలతో ప్రయత్నం
  • క్షేత్ర‌స్థాయిలో అధికారుల‌పై చ‌ర్య‌లు తీసుకోవాలి
  • తాము లేవనెత్తుతున్న ఆరోప‌ణ‌లు ఎన్నికల కమిషన్ వెబ్‌సైట్‌ నుంచి తీసుకున్నదే..
  • బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్ కేటీఆర్‌
  • ఓటర్ల జాబితాలో అవ‌క‌త‌వ‌క‌ల‌పై ఈసీకి ఫిర్యాదు

కాక‌తీయ‌, జుబ్లిహిల్స్ : జాతీయ స్థాయిలో రాహుల్ గాంధీ ఓటు చోరీ అంటే.. చోరీ ఓట్లతో ఇక్కడ గెలవడానికి కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేస్తుందని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని ఓటర్ల జాబితాలో ఉన్న దొంగ ఓట్లు, డూప్లికేట్ ఓట్లు ఇతర అవకతవకలపై వినతిపత్రం సమర్పించారు. అనంతరం పార్టీ సీనియర్ నేతలతో కలిసి రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి కార్యాలయం వద్ద మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ ఎట్లన్న గెలవాలని అన్ని అడ్డగోలు దారుల్లో ప్రయత్నం చేస్తుందని ఆరోపించారు. సామ, ధాన, భేద దండోపాయాలతో ప్రయత్నం చేస్తుందని.. మొత్తం రాష్ట్ర మంత్రులంతా జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో చేరి అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని మండిపడ్డారు. ఇలాంటి అధికార దుర్వినియోగంతో పాటు కాంగ్రెస్ పార్టీ జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో చేస్తున్న దొంగ ఓట్ల ప్రయత్నంపై రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారికి రిప్రజెంటేషన్ ఇచ్చామన్నారు.

400 బూత్‌లలో కనీసం 50 దొంగ ఓట్లు..

400 ఎన్నికల బూత్‌లలో కనీసం 50 దొంగ ఓట్లను కాంగ్రెస్ పార్టీ నమోదు చేసిందని కేటీఆర్‌ ఆరోపించారు. ఇట్లా కనీసం 20 వేల దొంగ ఓట్లను జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ నమోదు చేయించిందని.. ఒక్కొక్క వ్యక్తికి మూడు ఎన్నికల గుర్తింపు కార్డులు ఉన్నాయని.. ఒక్కటే అడ్రస్ తో మూడు ఓట్లు.. నాలుగు ఓట్లు ఒక్కొక్కరు నమోదు చేయించుకుంటున్నారన్నారు. ఒక్కొక్క వ్యక్తికి రెండు మూడు ఓటర్ ఐడీలు ఉన్నాయని.. ఒకటే వ్యక్తికి చిన్న చిన్న అక్షరాలను మార్చి అనేక సార్లు ఓట్ల నమోదు చేయించార‌ని ఆరోపించారు. తాము లేవనెత్తుతున్న ప్రతి అంశం కూడా ఎన్నికల కమిషన్ వెబ్‌సైట్‌ నుంచి తీసుకున్నదేనన్నారు. కేవలం మా పార్టీకి ఇప్పటిదాకా దృష్టికి వచ్చినవి 20వేల డూప్లికేట్ దొంగ ఓట్లు ఉన్నాయని.. ఇంకా ఎన్ని ఓట్లు ఉన్నాయో ఎలక్షన్ కమిషన్ తేల్చాలని డిమాండ్‌ చేశారు. ఒక్కొక్క ఇంట్లో 150 నుంచి 200 ఓట్ల నమోదు జరిగిందని.. ఆయా ఇళ్లకు సంబంధించి తాము వెళ్లి చూస్తే ఒకటే ఒక చిన్న ఇంట్లో 100కు పైగా ఓట్ల నమోదు కూడా జరిగిన సందర్భాలు వందల సంఖ్యలో ఉన్నాయన్నారు. 15 వేల ఓట్లు కేవలం ఈ విధంగా చిరునామాలు లేకున్నా నమోదు చేసుకున్నార‌ని ఆరోపించారు.

కుమ్మక్కుతో దొంగ ఓట్లు చేర్చినట్లుగా అనుమానం..

కాంగ్రెస్ పార్టీ కింది స్థాయి అధికారులతో కుమ్మ‌క్కై దొంగ ఓట్లు చేర్చినట్టు అనుమానం ఉందని.. ఈ మొత్తం ఓటర్ లిస్టు అవకతవకల పైన వాటిపైన పూర్తిస్థాయి దర్యాప్తు జరగాలి అని డిమాండ్ చేశామన్నారు. క్షేత్రస్థాయిలో కుమ్మకు అయిన అధికారుల పైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసి వారిని వెంటనే బదిలీ చేయాలని కోరామని.. 12వేల ఓట్లను వివిధ కారణాలతో తొలగించిన తర్వాత కూడా అదనంగా 7 వేల కొత్తగా చేరాయని.. మొత్తంగా డిలీట్ చేసినవి కొత్తగా చేరినవి కలిపితే సుమారు 19వేల కొత్త ఓట్లు కాంగ్రెస్ పార్టీ దొంగతనంగా చేరిందని ఆరోపించారు. ఈ అంశంలో పూర్తిస్థాయి దర్యాప్తు చేసి తగిన సమాధానం ఇస్తామని చెప్పిందని.. ఈ దొంగ ఓట్ల వ్యవహారంలో కాంగ్రెస్ పార్టీని ప్రజల క్షేత్రంలో ఎండగడుతామని కేటీఆర్ స్పష్టం చేశారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

మాగంటి సునిత ఎమోష‌న‌ల్ వీడియో..!

మాగంటి సునిత ఎమోష‌న‌ల్ వీడియో..! జూబ్లీహిల్స్ ఓట‌ర్ల‌కు విజ్ఞ‌ప్తి.. కాక‌తీయ‌, హైదరాబాద్ : జూబ్లీహిల్స్...

కాంగ్రెస్ పార్టీ దొంగ ఓట్లు వేయాల‌ని చూస్తోంది

https://twitter.com/TeluguScribe/status/1987795147560722497 కాంగ్రెస్ పార్టీ దొంగ ఓట్లు వేయాల‌ని చూస్తోంది ఫేక్ స్లిప్పుల‌ను ఎన్నిక‌ల అధికారికి...

క‌వి అందె శ్రీ క‌న్నుమూత‌

క‌వి అందె శ్రీ క‌న్నుమూత‌ కాక‌తీయ‌, హైద‌రాబాద్ : వాగ్గేయ‌కారుడు, క‌వి అందె...

“ఓటు అమ్మకండి, పిల్లల భవిష్యత్తు ఉరితీయకండి”.

“ఓటు అమ్మకండి, పిల్లల భవిష్యత్తు ఉరితీయకండి". జూబ్లీహిల్స్‌లో స్వతంత్ర అభ్యర్థి కోట శ్యామ్‌కుమార్...

సానుభూతి ఓట్లకు కేటీఆర్ పాకులాట‌

గోపీనాథ్‌ మృతిపై త‌ల్లి ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానం చెప్పాలి రెవెన్యూ, హౌసింగ్‌,...

ఇక్కడ అవకాశాలు పుష్కలం

ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో ‘తెలంగాణ’ రోల్ మోడల్ ...

తుపాన్ ప్ర‌భావంపై సీఎం రేవంత్‌ ఆరా

తుపాన్ ప్ర‌భావంపై సీఎం రేవంత్‌ ఆరా అధికార యంత్రాంగం స‌మ‌న్వ‌యంతో ప‌నిచేయాలి ఎన్డీఆర్ ఎఫ్...

మాజీమంత్రి హ‌రీష్‌రావుకు కేసీఆర్ ప‌రామ‌ర్శ‌

మాజీమంత్రి హ‌రీష్‌రావుకు కేసీఆర్ ప‌రామ‌ర్శ‌ కాక‌తీయ‌, హైద‌రాబాద్ సిటీ బ్యూరో : తన...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...

రేవంత్ కు కొత్త సవాల్!

* సర్కార్ కు పరీక్షగా సీఎస్ ఎంపిక? * ఈ నెలాఖరున రామకృష్ణారావు...

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం కాక‌తీయ‌, హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లాలోని బాటసింగారంలో...

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన ప్రతిపాదించిన ప్రాజెక్టుపై...

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా న్యూ డిల్లీ జూలై...

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు మొన్న యూనివర్సిటీల్లో ఆందోళనలు నిషేధిస్తూ మెమో నేడు...

రాష్ట్రంలో హద్దులు దాటిపోతున్న ఫోన్‌ ట్యాపింగ్‌

రాష్ట్రంలో హద్దులు దాటిపోతున్న ఫోన్‌ ట్యాపింగ్‌ కాంగ్రెస్‌ దూత ఫోన్‌ ట్యాపింగ్‌..! గాంధీ...
spot_img

Popular Categories

spot_imgspot_img