epaper
Saturday, November 15, 2025
epaper

కొత్త రేషన్ కార్డులతో పేదల జీవితాల్లో సంతోషం : ఎమ్మెల్యే డా మురళీ నాయక్

కొత్త రేషన్ కార్డులతో పేదల జీవితాల్లో సంతోషం : ఎమ్మెల్యే డా మురళీ నాయక్

కాక‌తీయ‌, మ‌హ‌బూబాబాద్ : మహబూబాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కాంగ్రెస్ ప్రభుత్వం అందిస్తున్న కొత్త రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో మహబూబాబాద్ శాసనసభ్యులు డా భూక్యా మురళీ నాయక్ గారు ముఖ్య అతిథిగా పాల్గొని, మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన అర్హులైన లబ్దిదారులకు ఆహార భద్రత పథకం కింద కొత్త రేషన్ కార్డులు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే డా మురళీ నాయక్ గారు మాట్లాడుతూ.. గతంలో అధికారంలో ఉన్న ప్రభుత్వాలు పేదల పట్ల తీవ్ర అన్యాయం చేశాయి. గత పది సంవత్సరాలపాటు రాష్ట్రంలో ఒక్క కొత్త రేషన్ కార్డు కూడా జారీ చేయలేదు. పేదలు ఎన్నిసార్లు ప్రయత్నించినా, వారి మొరల్ని పెదవిపైకి తీసుకురాలేకపోయారు. కాని ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ పాలనలో, ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ప్రభుత్వం పేదల కష్టాలను అర్థం చేసుకుని, వారి సమస్యల పరిష్కారానికి నడుం బిగించింది. ఆహార భద్రతతో పాటు, రేషన్ కార్డు ద్వారా పేదలకు అనేక ప్రయోజనాలు లభిస్తున్నాయని, ఇది న్యాయమైన హక్కుగా పరిగణించాలని అన్నారు. పల్లె ప్రజలకు అండగా నిలిచే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని తెలిపారు. ఈ నెల 25 నుండి వచ్చే నెల 10 వరకు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మండల కేంద్రాల్లో కొత్త రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం చేపట్టాలని అన్నారు. రేషన్ కార్డులు పంపిణీ చేసి, కుటుంబంలోని ఒక్కో వ్యక్తికి నెలకు ఆరు కిలోల చొప్పున సన్న బియ్యం ఇవ్వడం భారతదేశ చరిత్రలో నే ఒక రికార్డు. ఇలా అతి తక్కువ కాలంలోనే పేద ప్రజలకు అనేక సంక్షేమ పథకాలు అందించి పేదల ప్రభుత్వంగా ప్రజాధారణ పొందింది అని అన్నారు. కానీ కాంగ్రెస్ పార్టీ అందిస్తున్న సంక్షేమాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో మనం వెనకబడిపోయాము. ప్రతిపక్ష నాయకులు చేస్తున్న దుష్ప్రచారాలను తిప్పి కొట్టలేకపోతున్నారు అని కార్యకర్తలకు సూచించారు. కాంగ్రెస్ పార్టీ సంక్షేమాలను ఈ కరపత్రం ద్వారా గడప గడపకు చేరవేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు, జిల్లా నాయకులు, పట్టణ నాయకులు,మండల కాంగ్రెస్ నాయకులు, యూత్ నాయకులు,మాజీ సర్పంచులు, మాజీ ఎంపీటీసీలు, లబ్దిదారులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. లబ్దిదారులు తమకు రేషన్ కార్డు అందించిన ఎమ్మెల్యే గారికి కృతజ్ఞతలు తెలిపారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

గ్రామ సౌభాగ్యం – బీజేపీతోనే సాధ్యం

గ్రామ సౌభాగ్యం - బీజేపీతోనే సాధ్యం రాష్ట్ర నాయకులు డాక్టర్ పగడాల కాళీ...

నీళ్ల కోసం మరో తెలంగాణ ఉద్యమం చేస్తాం

నీళ్ల కోసం మరో తెలంగాణ ఉద్యమం చేస్తాం బనకచర్ల ప్రాజెక్టుపై చంద్రబాబు, రేవంత్...

రేవంత్ బెస్ట్ యాక్ట‌ర్‌

రేవంత్ బెస్ట్ యాక్ట‌ర్‌ ఆయ‌న‌కు భాస్క‌ర అవార్డు ఇవ్వాలి బీసీ రిజ‌ర్వేష‌న్ల‌పై కాంగ్రెస్‌వ‌న్నీ నాట‌కాలే బీసీ...

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు మొన్న యూనివర్సిటీల్లో ఆందోళనలు నిషేధిస్తూ మెమో నేడు...

మహాలక్ష్మి పథకం గ్రాండ్ సక్సెస్

మహాలక్ష్మి పథకం గ్రాండ్ సక్సెస్ 200 కోట్ల మంది ఉచిత ప్రయాణం 6680 కోట్ల...

అబద్దాల పాల‌న‌లో కాంగ్రెస్‌

అబద్దాల పాల‌న‌లో కాంగ్రెస్‌ వైఫ‌ల్యాల‌ను క‌ప్పిపెట్టేందుకు ప్ర‌జ‌ల‌ను త‌ప్పుదోవ‌ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్...

యూరియా రైతులకు సమృద్ధిగా అందాలి

యూరియా రైతులకు సమృద్ధిగా అందాలి నిర్ధేశించుకున్న ఆయిల్ ఫామ్ లక్ష్యాలను అధిగమించాలి అధికారులను ఆదేశించిన...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...

రేవంత్ కు కొత్త సవాల్!

* సర్కార్ కు పరీక్షగా సీఎస్ ఎంపిక? * ఈ నెలాఖరున రామకృష్ణారావు...

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం కాక‌తీయ‌, హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లాలోని బాటసింగారంలో...

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన ప్రతిపాదించిన ప్రాజెక్టుపై...

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా న్యూ డిల్లీ జూలై...

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు మొన్న యూనివర్సిటీల్లో ఆందోళనలు నిషేధిస్తూ మెమో నేడు...

రాష్ట్రంలో హద్దులు దాటిపోతున్న ఫోన్‌ ట్యాపింగ్‌

రాష్ట్రంలో హద్దులు దాటిపోతున్న ఫోన్‌ ట్యాపింగ్‌ కాంగ్రెస్‌ దూత ఫోన్‌ ట్యాపింగ్‌..! గాంధీ...
spot_img

Popular Categories

spot_imgspot_img