epaper
Saturday, November 15, 2025
epaper

ఎన్నో జన్మలు ఎత్తిన తర్వాత గాని ఈ మానవ జన్మ సాధ్యం కాదు

ఎన్నో జన్మలు ఎత్తిన తర్వాత గాని ఈ మానవ జన్మ సాధ్యం కాదు
ఈ జన్మలోనే మోక్ష సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి
స్వామి తత్పదానందజీ పిలుపు

కాక‌తీయ‌, హ‌న్మ‌కొండ : గురుదేవులు చెప్పినట్లు మానవ జీవిత లక్ష్యం భగవత్ సాక్షాత్కారమేనని ఎన్నో జన్మలు ఎత్తిన తర్వాత గాని ఈ మానవ జన్మ సాధ్యం కాదని ఈ జన్మలోనే మోక్ష సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని హైదరాబాద్ రామకృష్ణ మఠం స్వామీజీ “తత్పదానంద మహారాజ్”పిలుపునిచ్చారు. శ్రీ రామకృష్ణ సేవాసమితి కేఎల్ఎన్ రెడ్డి కాలనీ హనుమకొండ యందు గురుదేవులు శ్రీరామకృష్ణ పరమహంస భక్తుల “సత్సంగ్” కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా తత్పదానంద మహారాజ్ విచ్చేసి ప్రసంగించారు. జీవితంలో ప్రార్థన అనేది చాలా ముఖ్యమని ప్రతిరోజు ఉదయం లేవగానే కనీసం ఒక నిమిషం పాటైనా భగవంతుని గురించి ప్రార్థన చేయాలని భగవద్గీతలో బోధించినట్లు ఫలితాన్ని భగవంతునికే వదిలివేసి కర్మలు నిర్వహించాలని తెలియజేశారు.ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన సేవాసమితి అధ్యక్షులు కటంగూరి సత్యనారాయణ రెడ్డి మాట్లాడుతూ ప్రతి నెలలో 2వ శనివారం హనుమకొండ రామకృష్ణ ధ్యాన మందిర్ యందు సత్సంగ్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. గురుదేవుల ఆశయానికి అనుగుణంగా నెలలో ఒక రోజు ఇంటికి దూరంగా పూర్తిగా సాధు సన్యాసుల& భక్తుల సమక్షంలో సాధన చేయడం జరుగుతుందని తెలిపారు. స్వామీజీ మార్గదర్శనంలో సూచనాత్మక ధ్యానాన్ని నిర్వహించడం జరిగింది శ్రీ శారద మాతృమండలి ఆధ్వర్యంలో సామూహిక “లలిత చాలీసా” మరియు భజనలు చేయడం జరిగింది. రామకృష్ణ వివేకానంద భావ ప్రచార పరిషత్ తెలంగాణ గౌరవ ప్రతినిధి సూర్య ప్రకాష్ గారు మాట్లాడుతూ భారత జాతీయ జీవనానికి “ఆధ్యాత్మిక చింతన” మూలమని ఆధ్యాత్మికతను వదిలివేస్తే దేశం తిరిగి బానిసత్వానికి వెళ్తుoదని, ఆధ్యాత్మికంగా ప్రతి వ్యక్తిని ఉన్నతంగా తయారు చేయడమే రామకృష్ణ సేవా సమితుల ప్రధాన కర్తవ్యమని వివరించారు . ఈ కార్యక్రమానికి హాజరైన ప్రముఖ కవి, న్యాయవాది ఏరువాక జయశంకర్ మాట్లాడుతూ పాఠశాల విద్యార్థులలో దేశభక్తి, జాతీయత భావనలను కల్పించాలని తెలియజేశారు. ఈ సందర్భంగా వడ్డేపల్లి బృందావన్ అపార్ట్మెంట్ వాస్తవ్యులు మరియు సేవాసమితి విశిష్ట ధర్మకర్త డా॥ టి.వి. రమణాకర్ గారు భగవాన్ శ్రీరామకృష్ణ ధ్యాన మందిర నిర్మాణానికి మరో లక్ష రూపాయల విరాళం వారి ఉదార ధాతృత్వానికి నిదర్శనం. ఇంకా ఈ కార్యక్రమంలో సేవాసమితి రిటైర్డ్ ప్రొఫెసర్లు డా॥ రమణమూర్తి, రామన్న, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త సౌమిత్రి లక్ష్మణాచార్య, భజన కార్యక్రమ నిర్వాహకులు భాస్కర్, స్వరూప, రాధిక, అంజనీ దేవి, శిల్ప, సేవా సమితి ప్రతినిధులు శ్రీనివాస స్వామి, విష్ణువర్ధన్ రెడ్డి, కె వి రావు, తిరుపతిరెడ్డి, లక్ష్మీదేవి, లక్ష్మీ రావు, పార్వతి, అరుణ్, విష్ణు, సుమారు 100 మంది భక్తులు పాల్గొన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

మ‌హా నిమ‌జ్జ‌నానికి 30వేల మంది పోలీసులు

మ‌హా నిమ‌జ్జ‌నానికి 30వేల మంది పోలీసులు కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : హైద‌రాబాద్‌లో...

భారీగా నృసింహుని హుండీ ఆదాయం

భారీగా నృసింహుని హుండీ ఆదాయం రూ.2,45,48,023 కోట్ల నగదుతో పాటు ,బంగారం,వెండి,విదేశీ కరెన్సీ కాక‌తీయ‌,...

ఆలయాల నిర్మాణం కోసం అధ్యయనానికి దేశ వ్యాప్తంగా కమిటీ

ఆలయాల నిర్మాణం కోసం అధ్యయనానికి దేశ వ్యాప్తంగా కమిటీ సైబర్ సెక్యూరిటీ ల్యాబ్...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...

రేవంత్ కు కొత్త సవాల్!

* సర్కార్ కు పరీక్షగా సీఎస్ ఎంపిక? * ఈ నెలాఖరున రామకృష్ణారావు...

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం కాక‌తీయ‌, హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లాలోని బాటసింగారంలో...

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన ప్రతిపాదించిన ప్రాజెక్టుపై...

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా న్యూ డిల్లీ జూలై...

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు మొన్న యూనివర్సిటీల్లో ఆందోళనలు నిషేధిస్తూ మెమో నేడు...

రాష్ట్రంలో హద్దులు దాటిపోతున్న ఫోన్‌ ట్యాపింగ్‌

రాష్ట్రంలో హద్దులు దాటిపోతున్న ఫోన్‌ ట్యాపింగ్‌ కాంగ్రెస్‌ దూత ఫోన్‌ ట్యాపింగ్‌..! గాంధీ...
spot_img

Popular Categories

spot_imgspot_img