epaper
Thursday, January 29, 2026
epaper

హుస్నాబాద్ మార్కెట్‌కు నిధులు

హుస్నాబాద్ మార్కెట్‌కు నిధులు
యార్డుకు ‘అభివృద్ధికి మంత్రి పొన్నం చొర‌వ‌
రూ.8.05 కోట్లకు పరిపాలన అనుమతులు
గోడౌన్లు, షెడ్లు, డ్రెయిన్ల నిర్మాణానికి చ‌ర్య‌లు
మంత్రి పొన్నం కృషికి ఫలితం
రైతులు–మార్కెట్ వర్గాల్లో హర్షం

కాకతీయ, హుస్నాబాద్ : సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మార్కెట్ యార్డు అభివృద్ధికి ప్రభుత్వం భారీగా నిధులు విడుదల చేసింది. హుస్నాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీ పరిధిలో చేపట్టే వివిధ అభివృద్ధి పనుల కోసం మొత్తం రూ.805.50 లక్షలకు పరిపాలన అనుమతులు మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఈ నిధులు మార్కెట్ మౌలిక సదుపాయాల బలోపేతానికి కీలకంగా మారనున్నాయి. హుస్నాబాద్ మార్కెట్ యార్డులో గోడౌన్లు, కవర్డ్ షెడ్లు, లోతట్టు ప్రాంతాల్లో ఉపరితల సీసీ పనుల కోసం రూ.335 లక్షలు మంజూరు చేశారు. రైతులు తమ పంటలను నిల్వ చేసుకునేలా గోడౌన్లు, వర్షం నుంచి రక్షణ కలిగించే షెడ్ల నిర్మాణం జరగనుంది.

డ్రెయిన్లు–కాంపౌండ్ వాల్‌కు నిధులు

మార్కెట్ యార్డులో మిగిలిన భాగంలో కాంపౌండ్ వాల్ నిర్మాణానికి రూ.25 లక్షలు కేటాయించారు. అంతేకాకుండా యార్డు అంతర్గత ప్రాంతాల్లో డ్రెయినేజీ సమస్యలను పరిష్కరించేందుకు కాంపౌండ్ వాల్, ఇంటర్నల్ బాక్స్ డ్రెయిన్ వెంబడి ఓపెన్ డ్రెయిన్ నిర్మాణానికి రూ.400 లక్షలు మంజూరు చేశారు. దీంతో వర్షాకాలంలో నీరు నిలవకుండా సౌకర్యం కలగనుంది. మార్కెట్ యార్డులో విద్యుదీకరణ పనుల కోసం రూ.26 లక్షలు కేటాయించారు. అలాగే గోడౌన్లకు షెడ్లు, పీవీసీ గట్టర్లు, డౌన్ స్పౌట్లు కవర్ చేయడానికి ఎంఎస్ గట్టర్లు ఏర్పాటు చేయడానికి రూ.19.50 లక్షలు మంజూరు చేశారు. ఈ పనులన్నీ పూర్తయితే మార్కెట్ యార్డు రూపురేఖలు పూర్తిగా మారనున్నాయి.

మంత్రి పొన్నం కృషికి కృతజ్ఞతలు
హుస్నాబాద్ మార్కెట్ యార్డు అభివృద్ధికి భారీ నిధులు కేటాయించడంలో స్థానిక మంత్రి పొన్నం ప్రభాకర్ కృషి ఫలించిందని రైతులు, మార్కెట్ కమిటీ చైర్మన్, పాలకవర్గ సభ్యులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. రూ.8.05 కోట్ల నిధులు మంజూరు చేసినందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, స్థానిక మంత్రి పొన్నం ప్రభాకర్‌లకు రైతులు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. ఈ అభివృద్ధితో హుస్నాబాద్ మార్కెట్ యార్డు రైతులకు మరింత అనుకూలంగా మారనుంది.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

మున్సిపల్ ఎన్నికల్లో

మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్‌కు పట్టంకట్టాలి గులాబీ పార్టీతోనే కరీంనగర్ నగర అభివృద్ధి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు...

రథసప్తమి సూర్య నమస్కారాల పోటీ

రథసప్తమి సూర్య నమస్కారాల పోటీ కాకతీయ, కరీంనగర్ : రథసప్తమి సందర్భంగా శిశు...

ఈసీ నిర్ణ‌యం అభ్యంత‌ర‌క‌రం

ఈసీ నిర్ణ‌యం అభ్యంత‌ర‌క‌రం కీలుబొమ్మగా ఎన్నికల కమిషన్ గిరిజన కుంభమేళాను విస్మరించ‌డం బాధాక‌రం పండుగ వేళ...

ప‌క‌డ్బందీగా నామినేషన్ ప్ర‌క్రియ‌

ప‌క‌డ్బందీగా నామినేషన్ ప్ర‌క్రియ‌ ఎన్నికల విధుల్లో అప్రమత్తంగా వ్య‌వ‌హ‌రించాలి అధికారుల‌కు కలెక్టర్ పమేలా సత్పతి...

వొడితల ప్రణవ్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో పలువురి చేరిక..

వొడితల ప్రణవ్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో పలువురి చేరిక.. కాకతీయ,హుజురాబాద్‌: మున్సిపల్ ఎన్నికల...

ఎన్నికల నిబంధనలు కచ్చితంగా అమలు చేయాలి

ఎన్నికల నిబంధనలు కచ్చితంగా అమలు చేయాలి సిద్ధిపేట క‌లెక్ట‌ర్ కె. హైమావతి నామినేషన్...

బీఆర్ఎస్‌కు షాకిచ్చిన హుస్నాబాద్ లీడ‌ర్లు

బీఆర్ఎస్‌కు షాకిచ్చిన హుస్నాబాద్ లీడ‌ర్లు హస్తం గూటికి తాజా మాజీ చైర్మన్, వైస్‌చైర్మన్ మున్సిపల్...

నిధుల్లేవు.. పనుల్లేవు..!

నిధుల్లేవు.. పనుల్లేవు..! కరీంనగర్‌లో రెండేళ్లలో అభివృద్ధి శూన్యం కేంద్రం–రాష్ట్రం నిర్లక్ష్యం వల్ల నగరానికి నష్టం బీఆర్ఎస్...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..!

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..! చరిత్రకు జానపద స్వరం..అద్భుతం పాట రూపంలో సమ్మక్క–సారలమ్మ...

మేడారంలో హైటెక్ భద్రత

మేడారంలో హైటెక్ భద్రత మూడు కోట్ల మందికిపైగా భక్తుల రాక అంచనా కమాండ్ కంట్రోల్...

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...

రేవంత్ కు కొత్త సవాల్!

* సర్కార్ కు పరీక్షగా సీఎస్ ఎంపిక? * ఈ నెలాఖరున రామకృష్ణారావు...

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం కాక‌తీయ‌, హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లాలోని బాటసింగారంలో...

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన ప్రతిపాదించిన ప్రాజెక్టుపై...

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా న్యూ డిల్లీ జూలై...
spot_img

Popular Categories

spot_imgspot_img