epaper
Thursday, January 15, 2026
epaper

మొంథా తుఫానుతో అతలాకుతులం

మొంథా తుఫానుతో అతలాకుతులం

మహబూబాబాద్ జిల్లాకు రెడ్ అలర్టు

విద్యాసంస్థలకు సెలవు.

పలు రైళ్లకు అంతరాయం , ఎక్కడికక్కడే నిలిచిపోయిన రైళ్లు.

కళ్లాలో కొనుగోలు కేంద్రాలలో తడిసిపోయిన ధాన్యం

పడిపోయిన పంట పొలాలు.

ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్న జిల్లా కలెక్టర్ ,ఇతర అధికారులు

కాకతీయ, మహబూబాద్ ప్రతినిధి : మహబూబాబాద్ జిల్లాలో తుఫాన్ కారణంగా బుధవారం జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ రెడ్ అలర్టు ప్రకటించారు. జిల్లాలో ఉదయం 8 గంటల నుండి ఎడతెరిపిలేని వర్షంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఎడతెరిపిలేని వర్షంతో జిల్లా డీఈవో విద్యాసంస్థలకు సెలవు ప్రకటించారు. వర్షంతో కోతకు వచ్చిన పంట పొలాలు నేలవాలగా , నూర్పిడి చేసిన వరి మొక్కజొన్న ధాన్యం కల్లాలలో, కొనుగోలు కేంద్రాలలోతడిసి ముద్దయింది. దీనితో ఆరుగాలం కష్టపడిన రైతు లకు కన్నీరే మిగిలిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలోని మహబూబాబాద్ డోర్నకల్, గుండ్రాతి మడుగు రైల్వేస్టేషన్లో రైలు పట్టాలపై నీరు నిలవడంతో డోర్నకల్ స్టేషన్ గోల్కొండ, మహబూబాబాద్ కోణార్క్ ,కృష్ణ ఇతర రైళ్ళను పలు స్టేషన్లను నిలిపివేసినట్లు రైల్వే అధికారులు, ప్రయాణికులు తెలిపారు. దీనితో ప్రయాణికులకు తీవ్ర ఇబ్బందులు ఏర్పడినట్లు తెలిపారు. తుఫాన్ తో జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లాలోని అధికారులను అప్రమత్తం చేస్తూ, ఎప్పటికప్పుడు సమాచారంను చేరవేస్తూ జాగ్రత్తలు పాటించాలని ప్రాణ నష్టం జరగకుండా చూడాలని, లోతట్టు గ్రామ ప్రజలు జాగ్రత్తగా ఉండాలని , అవసరమైతే తప్ప ఇంటి నుండి బయటకు రావద్దని, ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షించాలని మండల అధికారులను ఆదేశించారు.

రైతులకు ముందస్తు జాగ్రత్తగా వారి ధాన్యాన్ని ధాన్యం కొనుగోలు కేంద్రాలలో తడవకుండా జాగ్రత్తలు పాటించాలని వ్యవసాయ అధికారులకు తగు సలహాలు సూచనలు తెలిపారు. అత్యవసర పరిస్థితులలో కలెక్టరేట్ లో ఏర్పాటుచేసిన కంట్రోల్ రూమ్ నెంబర్ 7995074803 ను సంప్రదించాలని తెలిపారు. తుఫాన్ తో విష జ్వరాలు ప్రబలకుండా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో సబ్ సెంటర్లో ముందస్తు చర్యలు తీసుకోవాలని వైద్యాధికారులను ఆదేశించినట్లు తెలిపారు. మండల అధికారులు సిబ్బంది కచ్చితంగా వారి కార్యాలయంలోనే ప్రజలకు అందుబాటులో ఉండాలని ఎప్పటికప్పుడు జిల్లా నుంచి ఆదేశాలను పాటిస్తూ తమకు సమాచారం అందించాలని కోరారు.

    

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

పల్లె పండుగలో పశువుల పరేడ్‌

పల్లె పండుగలో పశువుల పరేడ్‌ నర్సంపేట సంక్రాంతి సంబరాల్లో జీవ జాతులు గేదెలు,...

గట్టమ్మ ఆల‌యంలో గుడి మెలిగే పండుగ‌

గట్టమ్మ ఆల‌యంలో గుడి మెలిగే పండుగ‌ ఆదివాసీ నాయకపోడు సంప్రదాయాలతో శుద్ధి పండగ...

ఐనవోలు ఆలయం భక్తుల విశ్వాసానికి ప్రతీక

ఐనవోలు ఆలయం భక్తుల విశ్వాసానికి ప్రతీక భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పించాలి అధికారులు...

ముగ్గుల పోటీ విజేతలకు బహుమతుల ప్రధానం

ముగ్గుల పోటీ విజేతలకు బహుమతుల ప్రధానం కాకతీయ, దుగ్గొండి: సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకుని...

యువకులు క్రీడలపై మక్కువ చూపాలి

యువకులు క్రీడలపై మక్కువ చూపాలి ---- ఎస్సై కరుణాకర్ కాకతీయ, ఇనుగుర్తి: యువకులు చెడు...

మున్సిపాలిటీ ఎన్నికల్లో విజయమే లక్ష్యం

మున్సిపాలిటీ ఎన్నికల్లో విజయమే లక్ష్యం డోర్నకల్ అభివృద్ధి బిఆర్ఎస్ హయాంలోనే కాంగ్రెస్ హామీలపై మాజీ...

కాంగ్రెస్ లోకి మాజీ జెడ్పిటిసి పద్మ మేఘ నాయక్

కాంగ్రెస్ లోకి మాజీ జెడ్పిటిసి పద్మ మేఘ నాయక్ - ఎమ్మెల్యే దొంతి...

18 న మేడారానికి సీఎం రేవంత్ రెడ్డి

18 న మేడారానికి సీఎం రేవంత్ రెడ్డి 19న సమ్మక్క–సారలమ్మ గద్దెల పునరుద్ధరణకు...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...

రేవంత్ కు కొత్త సవాల్!

* సర్కార్ కు పరీక్షగా సీఎస్ ఎంపిక? * ఈ నెలాఖరున రామకృష్ణారావు...

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం కాక‌తీయ‌, హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లాలోని బాటసింగారంలో...

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన ప్రతిపాదించిన ప్రాజెక్టుపై...

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా న్యూ డిల్లీ జూలై...

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు మొన్న యూనివర్సిటీల్లో ఆందోళనలు నిషేధిస్తూ మెమో నేడు...

రాష్ట్రంలో హద్దులు దాటిపోతున్న ఫోన్‌ ట్యాపింగ్‌

రాష్ట్రంలో హద్దులు దాటిపోతున్న ఫోన్‌ ట్యాపింగ్‌ కాంగ్రెస్‌ దూత ఫోన్‌ ట్యాపింగ్‌..! గాంధీ...
spot_img

Popular Categories

spot_imgspot_img