epaper
Thursday, January 15, 2026
epaper

మోదీ తెలివైన నాయకుడు.. టారిఫ్స్ వంటి ఒత్తిళ్లకు తలొగ్గరు : పుతిన్

కాకతీయ, నేషనల్ డెస్క్: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భారత్‌తో వాణిజ్య అసమతుల్యతలను సవరించేందుకు కీలక చర్యలు చేపట్టాలని తన ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేశారు. సోచీలో జరిగిన వాల్దై డిస్కషన్‌ క్లబ్‌ సదస్సులో ఆయన మాట్లాడుతూ… భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీని తెలివైన, జాతీయవాద దృక్పథం కలిగిన జ్ఞానవంతుడైన నాయకుడిగా కొనియాడారు.

పుతిన్ మాట్లాడుతూ… ప్రధాని మోదీ ఎల్లప్పుడూ తన దేశ ప్రయోజనాలకే ప్రాధాన్యత ఇస్తారు. ఆయన నిజమైన జాతీయవాది, వ్యూహాత్మక దృక్పథం కలిగిన నాయకుడు. అమెరికా ఒత్తిడిని పట్టించుకోకుండా భారత్‌ రష్యా నుంచి చమురు దిగుమతులు కొనసాగించడం గొప్ప నిర్ణయమని అన్నారు. అమెరికా విధించిన సుంకాలు భారత్‌పై ప్రతికూల ప్రభావం చూపుతున్నప్పటికీ, రష్యా నుంచి చమురు దిగుమతులు ఆ నష్టాన్ని సమతుల్యం చేస్తున్నాయని పుతిన్ అభిప్రాయపడ్డారు. భారత్‌ స్వతంత్ర దేశం.. ఏ విదేశీ ఒత్తిడికీ ప్రధాని మోదీ తలొగ్గరు. భారత గౌరవం, వ్యూహాత్మక స్వయంప్రతిపత్తిని ఆయన కాపాడుతారని నమ్ముతున్నా అని ఆయన అన్నారు.

భారత్‌ రష్యా నుంచి విస్తృతంగా క్రూడ్ ఆయిల్ దిగుమతి చేసుకుంటున్న కారణంగా ఏర్పడిన వాణిజ్య అసమతుల్యతను సవరించేందుకు చర్యలు చేపట్టాలని పుతిన్ సూచించారు. ఇందుకోసం, రష్యా భారత్ నుంచి వ్యవసాయ ఉత్పత్తులు, ఫార్మా ఉత్పత్తులు మరింతగా దిగుమతి చేసుకోవచ్చని ఆయన తెలిపారు. ఫైనాన్సింగ్‌, లాజిస్టిక్స్‌, చెల్లింపులు ప్రధాన సవాళ్లుగా ఉన్నాయని, వీటిని పరిష్కరించగలిగితే ఇరు దేశాల మధ్య ఆర్థిక సంబంధాలు మరింత విస్తరించే అవకాశాలు ఉన్నాయని పుతిన్ పేర్కొన్నారు.

దాదాపు 15 ఏళ్ల క్రితం ఇరు దేశాలు వ్యూహాత్మక భాగస్వామ్యం స్థాపించాయని గుర్తుచేసిన పుతిన్, ఆ అనుబంధం ఇప్పటికీ బలంగా కొనసాగుతోందని తెలిపారు. భారత్-రష్యా మధ్య ఎప్పుడూ సమస్యలు లేదా ఉద్రిక్తతలు లేవు. మా సంబంధాలు ప్రత్యేకమైనవే అని ఆయన అన్నారు. ఇదిలా ఉండగా, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ డిసెంబర్ 5,6 తేదీల్లో భారత్ పర్యటనకు రానున్నారు. ప్రతి ఏటా జరిగే భారత్-రష్యా శిఖరాగ్ర సమావేశంలో పాల్గొని, ఇరు దేశాల మధ్య కీలక ద్వైపాక్షిక అంశాలపై చర్చించనున్నారు.

ఈ సమావేశంలో రక్షణ ఒప్పందాలు, ఇంధన సహకారం, వాణిజ్య సంబంధాలు, ఉక్రెయిన్ సంక్షోభం వంటి అంశాలు ప్రధానంగా చర్చించారు. రష్యా నుంచి S-400 క్షిపణి వ్యవస్థల సరఫరా, కొత్త ఇంధన ఒప్పందాలపై నిర్ణయాలు వెలువడే అవకాశం ఉంది. నిపుణుల అంచనాల ప్రకారం, ఈ పర్యటన భారత్-రష్యా వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయనుంది.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

భారత్​లో స్థిరత్వం

భారత్​లో స్థిరత్వం ప్రపంచమంతా అనిశ్చితి ఉన్నా మ‌నం సేఫ్‌ ప్రధాని న‌రేంద్ర మోదీ కాక‌తీయ‌, నేష‌న‌ల్...

సత్తుపల్లి కేంద్రంగా రూ.547 కోట్ల సైబర్‌ మోసం

సత్తుపల్లి కేంద్రంగా రూ.547 కోట్ల సైబర్‌ మోసం ఉద్యోగాల పేరుతో నిరుద్యోగులకు ఎర‌ వారి...

మాతృభాషను ప్రోత్సహించాలి

మాతృభాషను ప్రోత్సహించాలి భారత్​ అన్ని రంగాల్లో అగ్రగామిగా నిలవాలి స్వదేశీ వస్తువులను తయారు చేయడానికి...

కనకదుర్గ ఆలయంలో అవాంఛనీయ ఘటనలు

కనకదుర్గ ఆలయంలో అవాంఛనీయ ఘటనలు 15 రోజుల్లో మూడు ఘటనలతో భక్తుల్లో ఆందోళన అభిషేకం...

ఏవో.. యూరియా టోకెన్ల దందా

యూరియా టోకెన్ల దందా చెన్నారావుపేట‌లో బ‌య‌ట‌ప‌డిన ఏవో దందా సోషల్ మీడియాలో వైరల్ అయిన...

భూ భారతి పేరిట దోపిడీ!…. మీసేవ–స్లాట్ బుకింగ్ కేంద్రాల మోసం వెలుగులోకి

భూ భారతి పేరిట దోపిడీ! మీసేవ–స్లాట్ బుకింగ్ కేంద్రాల మోసం వెలుగులోకి జనగామలో రూ.78...

సోనియాగాంధీకి అస్వస్థత!

సోనియాగాంధీకి అస్వస్థత! దీర్ఘకాలిక దగ్గుతో బాధపడుతున్న కాంగ్రెస్ అగ్రనేత ఢిల్లీలోని సర్ గంగారామ్ ఆస్పత్రిలో...

నదీజలాల్లో తెలంగాణ‌కు కాంగ్రెస్ ద్రోహం

నదీజలాల్లో తెలంగాణ‌కు కాంగ్రెస్ ద్రోహం ఫజల్‌ అలీ నుంచి విభజన వరకూ మోసాలు పాలమూరుకు...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...

రేవంత్ కు కొత్త సవాల్!

* సర్కార్ కు పరీక్షగా సీఎస్ ఎంపిక? * ఈ నెలాఖరున రామకృష్ణారావు...

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం కాక‌తీయ‌, హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లాలోని బాటసింగారంలో...

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన ప్రతిపాదించిన ప్రాజెక్టుపై...

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా న్యూ డిల్లీ జూలై...

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు మొన్న యూనివర్సిటీల్లో ఆందోళనలు నిషేధిస్తూ మెమో నేడు...

రాష్ట్రంలో హద్దులు దాటిపోతున్న ఫోన్‌ ట్యాపింగ్‌

రాష్ట్రంలో హద్దులు దాటిపోతున్న ఫోన్‌ ట్యాపింగ్‌ కాంగ్రెస్‌ దూత ఫోన్‌ ట్యాపింగ్‌..! గాంధీ...
spot_img

Popular Categories

spot_imgspot_img