- రహదారి నిర్మాణంతో స్థానికుల హర్షం
కాకతీయ, నర్మెట్ట : జనగామ జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు గంగం నర్సింహా రెడ్డి తన సొంత నిధులతో సీసీ రోడ్డు వేసి ప్రజల ప్రశంసలు అందుకున్నారు. నర్మెట్ట మండల కేంద్రంలోని జనగామ–హుస్నాబాద్ ప్రధాన రహదారిలో పాలకేంద్రం కాజువే దగ్గర సీసీ రోడ్డు పనులను చేపట్టారు.
ఈ మేరకు కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు నియోజకవర్గ ఇంచార్జి, మాజీ ఎమ్మెల్యే కొమ్మూరి ప్రతాప్ రెడ్డి ఆదేశాల మేరకు సోమవారం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎస్సై నైనాల నగేష్, మండల అధ్యక్షుడు రాజబోయిన లక్ష్మీనారాయణ రాష్ట్ర ఓబీసీ సెల్ కార్యదర్శి పరిధుల యాదగిరి గౌడ్, ఎస్టీ సేల్ జిల్లా ఉపాధ్యక్షుడు భానోత్ బాలుసింగ్, మహిళా అధ్యక్షురాలు దేవుల భాగ్యలక్ష్మి, కిషన్ సెల్ మండల అధ్యక్షులు చేవుల పర్శరాములు, పీ ఏసీఎస్ డైరెక్టర్ కూకట్లా చంద్రమౌళి, మంకేన మొహన్ రెడ్డి, ధన్నరపు విరారెడ్డి గ్రామ అధ్యక్షుడు ప్రజ్ఞాపూరం శ్రీధర్, ఇట్టాబోయిన ప్రతాప్, తుంగా యాదగిరి, కొన్నే తిరుపతి, తీగుళ్ల భూపతి రెడ్డి, శివరాత్రి మహేష్, గొట్టే రాజశేఖర్, గంగం రాజిరెడ్డి, జేరిపోతుల మధు భానోత్ ఫిర్య, కొలిపాక సుధాకర్, రావుల కీషన్ తదితరులు పాల్గొన్నారు.


