కాకతీయ, నల్లబెల్లి: తెలంగాణ రాష్ట్రంలో భూముల విలువ అంతకంతకి పెరిగిపోతుంటే కబ్జాదారుల చూపు మాత్రం సులభంగా భూమిని పొందే మార్గాలపై పడుతుంది. 20 సంవత్సరాలుగా కబ్జాలో చిక్కుకున్న భూదాన్ భూమి సమస్య నల్లబెల్లి మండలంలోని రేలకుంట గ్రామంలో ఇటీవల వెలుగులోకి రావడంతో గ్రామ ప్రజలు సమస్యను పరిష్కరించి భూదాన్ భూమిని గ్రామ అభివృద్ధికి వినియోగించే అందుబాటులోకి తీసుకురావాలని వరంగల్ జిల్లా కలెక్టర్ ను కలిసి ప్రజావాణిలో సమస్యను వివరించగా స్పందించిన జిల్లా కలెక్టర్ నల్లబెల్లి ఎమ్మార్వో కు సూచించారు. విచారణ మొదలుపెట్టిన ఎమ్మార్వో కు భూదాన్ నుండి గతంలో పట్టాలు పొందినట్టు కబ్జాదారులు చెబుతుండడం, భూదాన్ భూమికి పట్టాలు ఎలా పొందారు, ఎవరిచ్చారు అంటూ గ్రామ ప్రజలు ప్రశ్నిస్తుండటం ప్రస్తుతం మండలంలో చర్చనీయాంశంగా మారింది.
కబ్జాలో 12 ఎకరాల భూధాన్ భూమి:
వరంగల్ జిల్లా నల్ల వెళ్లిమండలం రేలకుంట గ్రామ శివారు . గల. 317,318,319,320,321 సర్వే నెంబర్లలో 12 ఎకరాల భూమి అప్పటి భూస్వామి అయినా నేరేడుపల్లి వాస్తవ్యులైన మండవ విజయ్ కుమార్ పేరుపై ఉండగా వాడకంలో లేని భూమిపై కన్నేసిన ములుగు జిల్లా మమ్మద్ గౌస్ పల్లి గ్రామానికి చెందిన వ్యాపారి 12 ఎకరాల భూమిని కొనుగోలు చేసి గ్రామానికి చెందిన కొంతమంది పెద్ద మనుషుల సహాయంతో తన పేరు మీదికి పట్టాను పొందేందుకు ప్రయత్నించాడని, రిజిస్ట్రేషన్ కార్యాలయంలో రిజిస్ట్రేషన్ చేయించిన పిదప రేలకుంట గ్రామ ప్రజలు వ్యతిరేకించడంతో సదరు భూమిని అస్తగతం చేసుకునేందుకు ప్రయత్నం విరమించుకున్నట్టు, అదే సమయంలో తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడటం అప్పటి రాష్ట్ర ప్రభుత్వం భూమి యజమాన హక్కుల కోసం ధరణి పోర్టల్ ను అందుబాటులోకి తీసుకొచ్చే సమయాన్ని అదనుగా చూసుకొని రేలకుంట గ్రామానికి చెందిన కొందరు ప్రైవేటు వ్యక్తులు ఈ 12 ఎకరాల భూమిపై తప్పుడు ధ్రువపత్రాలతో భూ యజమాన హక్కులను పొంది తమ ఆధీనంలోకి తీసుకున్నారని, ఈ స్థలంలో సొంత నిర్మాణాలు తోపాటు మతపరమైన నిర్మాణాలను చేపడుతున్నట్టు గ్రామస్తులు ఆరోపిస్తున్నారు.
కలెక్టర్ వద్దకు కబ్జాల బాగోతం:
రేలకుంట శివారులోని 12 ఎకరాల భూదాన్ భూమిపై గ్రామస్తులందరూ ఆగస్టు 22వ తేదీన నిర్వహించిన ప్రజావాణిలో వరంగల్ జిల్లా కలెక్టర్ ను కలిసి కబ్జా లో ఉన్న భూమిపై వేగవంతమైన విచారణ జరిపించి కబ్జాదారులపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేయగా స్పందించిన జిల్లా కలెక్టర్ నర్సంపేట ఆర్డిఓ కి ఫిర్యాదును బదిలీ చేయగా నల్లబెల్లి ఎమ్మార్వో నీ విచారణ చేపట్టమని ఆర్డిఓ ఆదేశించినట్టు తెలుస్తోంది. గతంలో నల్లబెల్లి మండలంలో పనిచేసిన ఎమ్మార్వోలపై ఒత్తిడిల మూలాన గ్రామ ప్రజలు ఇదే భూమిపై పలుమార్లు ఫిర్యాదు చేసిన ఫలితం తేలకుండానే విచారణ ముగిసిపోయింది అని, ఈసారైనా జిల్లా కలెక్టర్ కలుగజేసుకొని కబ్జా కోరల నుండి భూదాన్ భూమిని రక్షించి ఊరికి మహిళలు ఆడుకోవడానికి బతుకమ్మ ఘాట్, దసరా ఉత్సవాల కోసం, యువకుల కోసం క్రీడా ప్రాంగణం ఏర్పాటు చేయాలని ఇదివరకు పని చేసిన ప్రజాప్రతినిధుల వలన రేలకుంట, నందిగామ గ్రామాలు మండలంలోని అతిపెద్ద గ్రామాలు అయినా ఈ గ్రామాలకు రావలసిన రైతు వేదిక,విద్యుత్ సబ్స్టేషన్లో, హై స్కూల్ భూమిలేని కారణంగా పక్క ఊర్లకు తరలి వెళ్లాయని,ఇప్పటికైనా కలెక్టర్ చెరువుతో రేలకుంట భూములను కబ్జాకోరాల నుండి విడిపించి గ్రామానికి మేలు జరిగేలా చూడాలని గ్రామ ప్రజలు ముక్తకంఠంతో కోరుకుంటున్నారు.
విచారణ చేపట్టి ఆర్డిఓ కి నివేదిక పంపించాం:నల్లబెల్లి ఎమ్మార్వో కృష్ణ
నల్లబెల్లి మండలం రేలకుంట గ్రామంలో కొత్త భూమి కబ్జా జరిగినట్టు జిల్లా కలెక్టర్ దృష్టికి వెళ్లడంతో ఆర్డీవో ఆదేశాల మేరకు విచారణ చేపట్టి సంబంధిత నివేదికను ఆర్డిఓకి పంపించడం జరిగింది..


