కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ మంత్రి శ్రీధర్ బాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తమపై వివక్ష చూపిస్తుందని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వ విధానాలపై శ్రీధర్ బాబు ఫైర్ అయ్యారు. శ్రీధర్ బాబు తెలిపిన వివరాల ప్రకారం..ఇండియా సెమీ కండక్టర్ మిషన్ ప్రాజెక్టు కోసం తెలంగాణ ప్రభుత్వం అవసరమైన అన్ని అనుమతులు ఇప్పటికే జారీ చేసింది.
రాష్ట్రం ప్రేమ్ లొకేషన్ లో పది ఎకరాల స్థలం కూడా కేటాయించింది. అయితే అదే ప్రాజెక్టు కోసం ఏపీ ఒక ఎకరాను కూడా కేటాయించలేదు. కేంద్రం ఆ ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందన్నారు శ్రీధర్ బాబు. రాజకీయ భావాలతో తీసుకున్న నిర్ణయాలు తెలంగాణ రాష్ట్రానికి అవమానకరంగా ఉంటాయి. మంత్రివర్గంలోని ఈ వ్యాఖ్యలు కేంద్రం విధానాలపై తెలంగాణ ప్రభుత్వం అసంత్రుప్తిని స్పష్టంగా చూపిస్తున్నాయి.
ఇలాంటి కేంద్ర విధానాలను తెలంగాణ ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోదని మంత్రి శ్రీధర్ బాబు వ్యాఖ్యానించారు. ప్రపంచ పెట్టుబడిదారులకు ఇలాంటి నిర్ణయాలు ఇబ్బందికరంగా మారుతాయన్నారు. మంత్రివర్గం కేంద్రంపై అసంత్రుప్తిని వ్యక్తి చేస్తూ భవిష్యత్తులో రాష్ట్ర ప్రతిఫలాల కోసం మరింత సమర్థవంతమైన విధానాలను తీసుకోవాలని డిమాండ్ చేసింది.


