epaper
Monday, December 1, 2025
epaper

బీసీలను మోసం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం

బీసీలను మోసం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం
42% రిజర్వేషన్లు ఇచ్చే వరకు సర్పంచ్ ఎన్నికలను అడ్డుకుంటాం
బీసీ హక్కులపై కాంగ్రెస్‌, బీజేపీ డ్రామాలు ఆపాలి
బీసీ రిజర్వేషన్లపై కాంగ్రెస్ యూ టర్న్ సిగ్గుచేటు
బీసీలకు న్యాయం చేయకపోతే కాంగ్రెస్, బీజేపీ భూస్థాపితం చేస్తాం
బీసీ జేఏసీ ఉమ్మడి వరంగల్ జిల్లా అధ్యక్షుడు వడ్లకొండ వేణుగోపాల్ గౌడ్

కాకతీయ, వరంగల్ బ్యూరో : స్థానిక ఎన్నిక‌ల రిజ‌ర్వేష‌న్లలో బీసీలకు న్యాయం చేయకపోతే తెలంగాణలో కాంగ్రెస్, బీజేపీలను భూస్థాపితం చేస్తామ‌ని బీసీ జేఏసీ నేత‌లు హెచ్చ‌రించారు. మహాత్మ జ్యోతిరావు పూలే 135వ వర్ధంతి సందర్భంగా హనుమకొండ కాకతీయ యూనివర్సిటీ ప్రాంగణంలోని పూలే దంపతుల విగ్రహాలకు ఉమ్మడి వరంగల్ బీసీ జేఏసీ కమిటీ ఆధ్వర్యంలో నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో బీసీ జేఏసీ ఉమ్మడి వరంగల్ జిల్లా అధ్యక్షుడు వడ్లకొండ వేణుగోపాల్ గౌడ్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలను నమ్మించి రిజర్వేషన్ల విషయంలో మోసం చేసిందని అన్నారు.మహాత్మా జ్యోతిరావు పూలే దశాబ్దాల క్రితమే వెనుకబడిన వర్గాల కోసం విద్య, ఉద్యోగాలు, రాజకీయ రంగాల్లో సమాన వాటా కల్పించాలని కలలు కన్నారు. జనాభాలో 60% ఉన్న బీసీలకు వాటా ఇవ్వాలని బీసీలు పోరాడుతున్నప్పటికీ, అగ్రవర్ణాలకు చెందిన రాజకీయ పార్టీల నుంచి స్పందన లేదని వేణుగోపాల్ గౌడ్ ఆవేదన వ్యక్తం చేశారు. 42% బీసీ రిజర్వేషన్లు అమలు చేసిన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలకు వెళతామని చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి, ఇప్పుడు రిజర్వేషన్లు పెంచకుండా, కేంద్రంపై పోరాడకుండా 23% రిజర్వేషన్లను 17%‌కు తగ్గించి సర్పంచ్ ఎన్నికలు నిర్వహించడం సిగ్గుచేటు అని తీవ్రంగా మండిపడ్డారు.బీసీ రిజర్వేషన్లను అడ్డుకుంటున్న బీజేపీ, రిజర్వేషన్లు పెంచకుండా రెడ్ల ఆధిపత్యాన్ని కొనసాగిస్తున్న కాంగ్రెస్ రెండూ బీసీలను మోసం చేస్తున్నాయని ఆరోపించారు. బీసీల కోసం పోరాటాన్ని మరింత ఉద్ధృతం చేస్తామని తెలిపారు. రిజర్వేషన్లకు చట్టబద్ధత కల్పించేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్ని పార్టీలతో కలిసి ఢిల్లీ వెళ్లి ప్రధానిని ఒత్తిడి చేయాలని అన్నారు. డిసెంబర్ తొలి వారంలో జరుగనున్న పార్లమెంట్ సమావేశాల్లో ఇండియా కూటమి 243 మంది ఎంపీలు పార్లమెంట్‌ను స్తంభింప చేయాలని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని ఒప్పించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో బీసీ జేఏసీ రాష్ట్ర, జిల్లా నాయకులు డా. చిర్ర రాజు గౌడ్, దాడి మల్లయ్య యాదవ్, డా. సంగాని మల్లేశ్వర్, బోనగాని యాదగిరి, తమ్మేలా శోభరాణి, భీమగాని యాదగిరి, కాసగాని అశోక్ గౌడ్, సమ్మయ్య, బక్కి అవినాష్ పటేల్, తెల్ల సుగుణ, కిషోర్, ప్రమోద, మానస తదితరులు పాల్గొన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

డిసెంబర్ 3న జర్నలిస్టుల సమస్యలపై మహా ధర్నా

డిసెంబర్ 3న జర్నలిస్టుల సమస్యలపై మహా ధర్నా టీయుడబ్ల్యూజె (ఐజెయు) ఆద్వర్యంలో కరపత్రాల...

హెల్ప్ డెస్‌లో అభ్య‌ర్థుల‌కు సూచ‌న‌లు అంద‌జేయాలి

హ‌న్మ‌కొండ జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ పరిశీలన కాకతీయ, హనుమకొండ...

ఘనంగా మహా దివ్య పడిపూజ భిక్ష

ఘనంగా మహా దివ్య పడిపూజ భిక్ష కాకతీయ ,హుజురాబాద్ : కరీంనగర్ జిల్లా...

తిండి అగ్గువే! తొండే ఎక్కువ!!

తిండి అగ్గువే! తొండే ఎక్కువ!! అన్నం పథకంలో అవకతవకలు రూ.5ల భోజనంలో అక్రమాలు పేరుకే తక్కువ...

మ‌హ ప్ర‌భో ఈ బియ్యం తీసుకెళ్లండి

మ‌హ ప్ర‌భో ఈ బియ్యం తీసుకెళ్లండి మార్చి నెల నిల్వ‌ల‌తో రేష‌న్ డీల‌ర్ల‌కు...

బాధిత కుటుంబానికి ఎర్ర‌బెల్లి ప‌రామ‌ర్శ‌

బాధిత కుటుంబానికి ఎర్ర‌బెల్లి ప‌రామ‌ర్శ‌ కాకతీయ, రాయపర్తి : మండలంలోని బురహాన్ పల్లికి...

బీఆర్ఎస్‌లో చేరిన నందిగామ యువకులు

బీఆర్ఎస్‌లో చేరిన నందిగామ యువకులు కాకతీయ, నల్లబెల్లి : వ‌రంగ‌ల్ జిల్లా న‌ల్ల‌బెల్లి...

పీసీసీ అధ్యక్షుడుని కలిసిన కుడా ఛైర్మన్

పీసీసీ అధ్యక్షుడుని కలిసిన కుడా ఛైర్మన్ కాకతీయ, హ‌న్మ‌కొండ : హనుమకొండ జిల్లా...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...

రేవంత్ కు కొత్త సవాల్!

* సర్కార్ కు పరీక్షగా సీఎస్ ఎంపిక? * ఈ నెలాఖరున రామకృష్ణారావు...

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం కాక‌తీయ‌, హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లాలోని బాటసింగారంలో...

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన ప్రతిపాదించిన ప్రాజెక్టుపై...

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా న్యూ డిల్లీ జూలై...

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు మొన్న యూనివర్సిటీల్లో ఆందోళనలు నిషేధిస్తూ మెమో నేడు...

రాష్ట్రంలో హద్దులు దాటిపోతున్న ఫోన్‌ ట్యాపింగ్‌

రాష్ట్రంలో హద్దులు దాటిపోతున్న ఫోన్‌ ట్యాపింగ్‌ కాంగ్రెస్‌ దూత ఫోన్‌ ట్యాపింగ్‌..! గాంధీ...
spot_img

Popular Categories

spot_imgspot_img